కాంగ్రెస్ తో పొత్తు దేశం కోసం అయితే ఇప్పుడు బీజేపీ తో పొత్తు రాష్ట్రం కోసం. ఎలాగూ అది నమ్మరు కాబట్టి కనీసం క్యాడర్ ని అయినా నమ్మించే ప్రయత్నంలో భాగంగా బీజేపీ తో పొత్తు పెట్టుకుంది ఎన్నికలు సవ్యంగా జరగాలి అని వింత వాదన.బీజేపీ తో పొత్తు లేని చోట ఎన్నికలు సజావుగా జరగవు అని టీడీపీ ఉద్దేశమా? బీజేపీ తో పొత్తు ఉంటే ఎన్నికలు సజావుగా ఎలా జరుగుతాయి? అంటే బిజెపి ఎన్నికల ని మ్యానిపులేట్ చేస్తుంది అని బాబు అండ్ కో ఉద్దేశమా?
కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి ఎన్నికల్లో మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉంటే 2014 ఎన్నికల్లో బీజేపీ తో పొత్తు ఎందుకు పెట్టుకోవడం? జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కన్నా ఇంకెవరైనా బలంగా ఎదుర్కుంటారా ఎన్నికలను? అప్పుడు గెలిచారు కదా? 2019 లో బిజెపి తో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లినందుకు బిజెపి ఎన్నికలను సజావుగా జరగనివ్వలేదు అని బాబు అండ్ కో ఉద్దేశం అయితే అలాంటి పార్టీ తో పొత్తు దేనికి?
ప్రజల్లో బలం లేక ఇలాంటి సొల్లు కబుర్లు అన్నీ చెప్పాల్సి వస్తుంది. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆమె బాబు లా కాదు అధికారంలో ఎవరు ఉంటే వారి సంక ఎక్కదు, మొదటి నుండీ బీజేపీ వ్యతిరేఖే.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా గత ఎన్నికల్లో గెలిచిన 3 సీట్ల నుండి 77 సీట్లకు ఎగబాకి ఏకంగా ప్రతిపక్ష హోదా సంపాదించింది బీజేపీ. అలాంటి చోటే ఎలాంటి పొత్తు లేకుండా మమతా బెనర్జీ సింగిల్ గా 42 స్థానాల్లో పోటీ చేస్తానని అభ్యర్థులను ప్రకటించింది. మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి అనీ, బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలను ప్రోత్సహిస్తుంది అనీ, ఆమె పాలనలో బెంగాల్ లో ముస్లిం జనాభా పెరిగిపోతుంది అనీ, హిందూ కార్యక్రమాలు అనుమతులు ఇవ్వకుండా ముస్లిమ్ లకు మాత్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఆమెపై భయంకరమైన పోరాటాన్ని బీజేపీ చేస్తుంది. అయినా ఆమె ఏ పొత్తు లేకుండా ధైర్యం గా నిలబడుతూనే ఉంది. ఎన్నికలు సవ్యంగా జరగాలి అంటే బిజెపి తో పొత్తు ఉండాలి అనడం పరోక్షంగా బీజేపీ ని అవమాన పరచడమే.. ప్రజాస్వమ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణకు వారు సహకరించడం లేదనే అర్థం అందులో నిబిడీకృతం అయ్యుంది..
బీజేపీ కి టీడీపీ అయినా, వైసీపీ అయినా ఒకటే, తమ బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్ కూడా తెలంగాణ ఎన్నికల్లో గెలిచింది. అంటే ఎన్నికలు సవ్యంగా జరగినట్లా? కాదా? మరి ఆంధ్ర ప్రదేశ్ ఒక్క విషయంలోనే ఎన్నికల్లో అపసవ్యం ఎందుకవుతుంది?
కేవలం నేను ఓడిపోయా, ఇక నా వల్ల కాదు, నన్ను నా పార్టీ ని దయతలచండి, రాజకీయాల నుండి తప్పుకుంటా కేసుల నుండి విముక్తి చేసి జీవిత చరమాంకం లో నన్ను హుందాగా జీవించనివ్వండి అని మాత్రమే బాబు కోరుకుంది. దానికి బీజేపీ కి ఆయన ఇవ్వజూపిన ప్రతిఫలమే నేటి పొత్తు, రేపటి విలీనం…