ఎన్నో ఆశలు పెట్టుకున్న పొత్తు పులిహోర అయింది, పొత్తుకోసమే గత నాలుగు ఏళ్లగా బీజేపీ చెంతకు పవన్ ని చేర్చి రకరకాల ప్రయత్నాలు చేసిన బాబు ఆశలు గల్లంతయ్యాయి.
2019 లో ఓటమి తర్వాత నుండీ బిజెపి తో పొత్తుకోసం బాబు విశ్వప్రయత్నాలు చేసినా టీడీపీ పరిస్థితి చూసి బిజెపి ఎప్పటికప్పుడు బాబును దూరమే పెట్టింది, ఎంత వేచి చూసినా బాబు పరిస్థితి అద్వానంగా తయారవుతుంది అని రిపోర్ట్ ల దృష్ట్యా బాబుకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కేంద్ర అధినాయకత్వం. కానీ రాష్ట్ర బీజేపీ లో ఉన్న కొందరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా పదవి పొందే ఆశావహులు మాత్రం టీడీపీ తో పొత్తు కుదిరితే తాము ఎంపీ లుగా గెలిచి కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు..
తాజాగా అందుతున్న సమాచారం మేరకు తమ స్వార్థం కోసం టీడీపీ తో పొత్తుకు వెంపర్లాడుతున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని సమావేశ పరిచి చీవాట్లు పెట్టినట్లు తెలుస్తుంది.. బాబుతో ప్రయాణం ఎంత ప్రమాదకరమో, బాబు మోసమెలాంటిదో బాగా తెల్సినా కేంద్ర నాయకత్వం టీడీపీ తో పొత్తుకు ససేమిరా అంటున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వ లాబీయింగ్ పై సీరియస్ అయ్యారని సమాచారం…
ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన లతో బీజేపీ పొత్తు అనే ప్రహసనం ఆదిలోనే అంతం అయింది.. తెలంగాణ లో బీసీ ముఖ్యమంత్రి అనే ఆయుధం వాడిన బీజేపీ, ఏపీ లో ప్రస్తుతం కాపు సీఎం అనే అస్త్రం బయటకు తీయనుంది, పవన్ కల్యాణ్ తనతో ఉంటే కాపు ఓట్లన్నీ గంపగుత్తా గా తనకే అని కలలు గన్న బాబుకు ఇది గొంతులో వెలక్కాయ పడిన చందాన అవ్వబోతుంది…