దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉంటుంది తెలుగుదేశం వ్యవహారం. చేసేదంతా చేసి వేరే వాళ్లపైకి నెట్టేస్తుంది. మొదటి నుంచి దానిది అదే నైజం. తాజాగా కొత్తపలుకులో ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారు. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయన సోషల్ మీడియా సైన్యం హద్దుల్లేకుండా వ్యవహరిస్తోందంట. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వారు మరింత రెచ్చిపోయారని చెబుతూ ఉన్మాదులుగా అభివర్ణించి చంద్రబాబు సేవలో తరించారు. షర్మిల, సునీతలపై ఎక్కడ లేని ప్రేమ చూపించారు. ఎందుకంటే వాళ్లు బాబు చెప్పినట్లు వింటున్నారు కదా..
చంద్రబాబుకు నచ్చని వారిపై ఆ పార్టీ సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్ (ఎక్స్), ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చాలా దారుణంగా దుష్ర్పచారం చేస్తుంది. ఇందుకోసం కొందరికి జీతాలిచ్చి నియమించుకుంది. వాళ్లు న్యూట్రల్ ముసుగులో సినిమా పోస్టులు పెడుతున్నట్లు నటిస్తూ వైఎస్సార్సీపీ, జగన్, ఆయన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తుంటారు. ఐటీడీపీనే వారికి కంటెంట్ అందిస్తుంది. ఫేక్ అకౌంట్లతో సొంత పార్టీ, అధికార పార్టీలోని ఆడవాళ్లని తిడుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. వాళ్లంతా జగన్, వైఎస్సార్సీపీ బొమ్మ పెట్టుకుని పోస్టులు పెడుతుంటారు. చూసే వారికేమో ఇది సీఎం పార్టీ వారే చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. గతంలో షర్మిలపై దుష్ర్పచారం చేసింది టీడీపీ వాళ్లనే ఓ సందర్భంలో తేలింది. ఈ విషయమై ఆమె తెలంగాణలో కేసు కూడా పెట్టింది. ఇప్పుడు ఆ విషయం మహా తల్లికి గుర్తు ఉండకపోవచ్చు.
నేడు అదే షర్మిల, సునీతలను జగన్ మనుషులు తిడుతున్నారంటూ రాధాకృష్ణ తెగ బాధపడిపోయారు. సొంత అన్నే ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి తిట్టింది టీడీపీకి చెందిన వారేనని అందరికీ తెలుసు. అయితే జగన్ బొమ్మను వాడుకున్నారంతే. ఇది ఏబీఎన్కు తెలియక కాదు. అయితే వైఎస్సార్సీపీని ఏదో విధంగా లాక్ చేసి చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలనేది దాని ప్రయత్నం.
ఇటీవల జగన్ సతీమణి భారతిపై తెలుగుదేశం నాయకులు చాలా దారుణంగా పోస్టులు పెట్టారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. దీనిని ఖండించాల్సిన బాబు అండ్ కో సమర్థించింది. మీ వెనుక మేమున్నాం. ఏమైనా మాట్లాడంటూ ప్రోత్సహించారు. ఈ విషయమై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తే బాబు మహిళా కార్డు తీశారు. రాధాకృష్ణకు ఇవేమీ కనిపించావా అంటే.. అలా ఏమి లేదు. కనిపిస్తాయి. కాకపోతే ఏదో విధంగా జగన్ను బజారుకు ఈడ్చాలి. అందుకు ఏదైనా చేస్తారు. తెలుగుదేశం సోషల్ మీడియా ఎంత దారుణంగా తిట్టినా పడాలా.. పైగా షర్మిల, సునీతపై మీ వాళ్లే పోస్టులు పెట్టి జగన్, ఆయన వారియర్స్పై నెట్టేయడం కరెక్టేనా.. మీరు సమాధానం చెప్పరు. మరోవారం కొత్తపలుకులో ఇంకా దారుణంగా రాస్తారు. జనం ఎంత ఛీ కొట్టినా మారరు.
– వీకే..