చంద్రబాబు జైలుకెళ్లగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్తామని ప్రకటించారు. అయితే అంతకుముందు ఆ తరువాత ఎప్పుడూ వారిద్దరు రహస్య ప్రేమికులనేది జగమెరిగిన సత్యం. కానీ తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలిద్దరూ పొత్తులు కుదర్చుకుంటుంటే నియోజకవర్గాల్లో నేతలు సీట్ల కోసం కొట్టుకుంటున్నారు.
ఈ మధ్య విజయవాడ ఎంపీ సీటు విషయంలో కేశినాని నానికి టీడీపీ షాకివ్వాలనుకుంటే.. ఆయనే టీడీపీని షేక్ చేసిపడేసాడు.. ఇప్పుడు విజయవాడ ఎంపీ సీటు ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.. టీడీపీ అభ్యర్ధి లేరు కాబట్టి జనసేనకి ఆ సీటు కేటాయించొచ్చు.. కానీ టీడీపీ ఆ పని మాత్రం చెయ్యదు.. కారణం ఏంటంటే జనసేన పార్టీ ఎప్పటికీ టీడీపీ జెండా మోసే కూలీ పార్టీగానే ఉండాలి కానీ వారితో కలిసి రాజకీయాలు చేసే స్థాయికి రాకూడదన్నది టీడీపీ ఆలోచన.
ఇక గుంటూరు జిల్లా తెనాలి నుంచి పోటీ చేస్తానని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కానీ అక్కడి ఎమ్మెల్యే సీటు కు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అక్కడి నుండే ఎన్నికల బరిలో దిగేందుకు ప్రణాళికలు రచిస్తూ పాదయాత్ర చేస్తూప్రచారంలో దూసుకుపోతున్నారు.. ఇలా పార్టీల పొత్తు ఆంతర్యం ఏమిటో అర్ధం కాకుండా ప్రవర్తిస్తున్నాయి ఇరుపార్టీలు. దెందులూరు ఎమ్మెల్యే సీటు విషయంలో కూడా ఇలాంటి సందిగ్ధ పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయి.
నిజానికి టీడీపీ జనసేన పార్టీలు రాబోయే ఎన్నికల విషయంలో వైసీపీ కి భయపడుతూ ఎటూ దిక్కుతోచని స్థితిలో విలవిలలాడుతున్నాయి. ఇందులో జనసేన పార్టీ పరిస్థితి అయితే మరీ ఘోరం.. రెండిటికీ చెడ్డ రేవడిలా.. సొంతంగా పోటీ చెయ్యడానికి శక్తిలేదు.. పొత్తుతో పోటీ చెద్దామంటే అసలు పవన్ కళ్యాణ్ నిలబడాలనుకుంటున్న 2 స్థానాల్లోనైనా టీడీపీ అభ్యర్ధులు నిలబడకుండా ఆయనకి చోటు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి.. ఈ విధంగా జనసేనానికే దిక్కు లేదంటే ఇక సైన్యం పరిస్థితి ఏంటో మరి..
టీడీపీ జనసేన పార్టీలు పొత్తు అయితే పెట్టుకున్నాయంటున్నాయి.. కానీ సీట్ల విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటనలు జరగలేదు.. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య చిచ్చులు చెలరేగి.. చిన్న చిన్నగా పెరిగి పెద్దవవుతున్నాయి. ఇప్పుడు టీడీపీ నేతలకు, జనసేన నాయకులకు, వైసీపీ ఫిరాయింపుదారులకు ఇంతమందికి టీడీపీ అధినేత సీట్లు ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి మరి.. తీరా సీట్లు ఖరారు చేసాక టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఎంత మంది రోడ్డు ఎక్కుతారో?. ఎంత మంది ఆత్మహత్య ప్రయత్నం చేస్తారో వేచి చూడాలి. సీట్ల విషయంలోనే క్లారిటీ తెచ్చుకోలేని టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించాక వచ్చే వివాదాలను తీర్చటానికి ఇంకెంత ఇబ్బందిపడతారో మరి ఇదిలా ఇలా ఉంటే వీరిరువురికీ పోటీ అయిన వైఎస్సార్సీపీ మాత్రం అభ్యర్ధులను ప్రకటించేసింది. ఎన్నికల ప్రచారమూ మొదలుపెట్టేసింది..