2024 సార్వత్రిక ఎన్నికలు మొదలవ్వగానే టీడీపీ, జన సేన, బిజెపి కూటమిగా ఏర్పడి ఎలక్షన్స్ కు సిద్ధమయ్యారు. దీనితో రాష్ట్రంలో మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలో కూటమికి సీట్ల పంపకాల్లో వచ్చిన తేడాలతో టీడీపీ, జన సేన నాయకులు కుత కుతమంటున్నారు. టీడీపీకి చెందిన బలమైన నాయకులు తాడేపల్లిగూడెం ముఖ్య నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఈలి నాని తో మొదలు పెడితే, ఏలూరు ఎంపీ అభ్యర్థి అనుకున్న ముఖ్యమైన బీసీ నాయకుడు గోపాల్ యాదవ్ , నూజివీడు కు చెందిన చిన్నం రామకోటయ్య , ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామ రాజు, రాజోలులో గొల్లపల్లి సూర్యారావు, చింతలపూడిలొ మాజీ మంత్రి పీతల సుజాత , రామచంద్ర పురం కు చెందిన రేవు శ్రీను ఇప్పటికే టీడీపీ పార్టీ కి రాజీనామా చేశారు, వీరిలో సగం మంది వైసీపీ లో జాయిన్ అయ్యారు. సగం మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో వుంటున్నామని ప్రకటించారు.
రాజానగరంకు చెందిన బొడ్డు భాస్కరరావు చంద్రబాబు నాయుడి వెన్నుపోటుతో పార్టీకు సంబంధం లేకుండా తిరుగుతున్నారు, అనపర్తి లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి చంద్రబాబు చేసిన మోసంను ప్రజలకు వివరిస్తాము అంటూ కుటుంబ సభ్యులతో కలిసి నియోజకవర్గం లో ఐదు రోజులు పర్యటన చేస్తున్నట్టు ప్రకటించారు. తుని టీడీపీలో యనమల కృష్ణుడు ఇప్పటికే రచ్చ రచ్చ చేస్తున్నారు, కాకినాడ సిటీ అభ్యర్థికి తన సొంత అన్ననే సపోర్ట్ చెయ్యకుండా వున్నారు. వారితో పాటు మాజీ మేయర్ పావని కూడా సహాయనిరాకరణ చేస్తున్నారు. పోలవరం టీడీపీ నేతలు ఇప్పటికే మేము కూటమికి సపోర్ట్ చెయ్యడం లేదు అని ప్రకటించారు. పిఠాపుంలో వర్మ చంద్రబాబుకు లొంగిపోయినా మిగతా నాయకులు, కార్యకర్తలు జన సేన కు సహకరించే పరిస్థితి లేదు.
ఇటు పొత్తు వలన కూటమిలోని మరో పార్టీ అయిన జన సేనకు భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొదట జగ్గంపేట కు చెందిన సూర్య చంద్ర నుంచి దావానలంలా మొదలై తణుకులో విడివాడ , రాజోలులో బొంతు రాజేశ్వరరావు, ముమ్మడివరంలో పితాని బాలకృష్ణ, కాకినాడ సిటీలో మాజీ మేయర్ సుజాత, దెందులూరు లో జన సేన కార్యకర్తలు టీడీపీకి సహకరించే ప్రసక్తే లేదు అని తీర్మానించుకున్నారు, కొత్తపేట లో శ్రీనివాస్, ఏలూరు,పెద్దాపురం, ఆచంట లో చేగొండి సూర్య ప్రకాష్, ఉంగటురులో నౌడు వెంకటరమణ, పిఠాపురంలో శేషు కుమారి, ఇలా ముఖ్య నాయకులు జన సేన పార్టీ కి రాజీనామా చేశారు. రాజమండ్రీ రూరల్ లో టికెట్ గొడవలతో జన సేన కార్యకర్తలు కూటమి ప్రచారానికి దూరంగా వున్నారు. మండపేటలో టీడీపీకి జనసేన మధ్య పెద్ద ఎత్తున యుద్ధమే జరుగుతుంది.
ఈ పొత్తుల కుంపటి లో టికెట్ కోల్పోయిన టీడీపీ, జన సేన నాయకులు ముఖ్యంగా కార్యకర్తలు ఒకరికి ఒకరు సహకరించే పరిస్థితులు కనపడటం లేదు ఈ గొడవలు కూటమి పుట్టి ముంచే విధంగా వున్నాయి అని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.