గతంలో బిజెపి వలన రాష్ట్రం నాశనం అయ్యింది , ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని బిజెపి కూటమి నుండి బయటకు వచ్చారు చంద్రబాబు. గోద్రాలో 2000 మందిని చంపిన ద్రోహి, పెళ్ళాన్ని వదిలేసిన ఫకీర్ అని కూడా తిట్టారు. దానితో పాటు మోడి , అమిత్ షా ఎవ్వరు అంటూ , అమిత్ షా మీద రాళ్ళ దాడి చేసారు టీడీపీ శ్రేణులు .
అదే టైం లో పోలవరం ను చంద్రబాబు ఏటిమ్ గా మార్చుకున్నాడు అని మోడి తీవ్ర అరోపణలు చేసారు ..కట్ చేస్తే గత రెండేళ్ల కాలంగా బిజెపి పోత్తు కోసం చంద్రబాబు చెయ్యని ప్రయత్నాలు లేవు . తన వదిన పురందేశ్వరితో ఒక వైపు , ఇంకో వైపు పవన్ కళ్యాణ్ తో , అలాగే రఘురామకృష్ణంరాజు , తన పార్టీ నుండి బిజెపి లోకి వెళ్ళిన సూజన చౌదరిల, సిఎం రమేష్ లతో కలిసి పొత్తు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు
చివరకు బిజెపి పొత్తులకు అంగీకారం తెలిపి గత మూడు రోజులుగా తిప్పించుకుంటు కనీస గౌరవం ఇవ్వకపోయినా పొత్తు కోసం పడిగాపులు కాస్తూ తీవ్రంగా ప్రయత్నం చేసారు
దీనికి కారణం ఏమిటి అంటూ విచారణ చెయ్యగా తెలిసిన సమాచారం మేరకు తన మీద వున్న స్కీల్ స్కాం , ఇన్నర్ రింగు రోడ్డు , అమరావతి కేసులతో పాటు కొత్తగా ING లక్ష కోట్ల స్కాం లో సిబిఐ ఎంక్వైరీ ఆదేశాల భయంతో బిజెపితో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని అభిజ్ఞ వర్గాల భోగట్టా.
పొత్తు వలన రాబోయే ఎన్నికల్లో గెలిచినా ఓడినా కూడా కేంద్రంలో బిజెపినే అధికారం లోకి వస్తుందనే అంచనాలతో నెక్స్ట్ అయిదేళ్లు బిజెపి పంచన పడి ఉంటే ఈ కేసుల నుండి తప్పించుకోవచ్చు అనే అలోచనలతో బిజెపి ఎంత అవమానించిన, బిజెపి ఎన్ని సీట్లు అడిగిన ఇవ్వడానికి బాబు సిద్దమైనట్లు తెలుస్తుంది ..