ఉండవల్లిలోని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద టిడిపి నాయకులు ఆందోళన రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా చంద్రబాబు నివాసం వద్ద కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషా అనుచరులు ఆందోళన చేపట్టారు. ఉండవల్లి నివాసం నుంచి నారా లోకేష్ ప్రచార నిమిత్తం గుంటూరు వెళ్తున్న సమయంలో నారా లోకేష్ కాన్వాయ్ కి అడ్డుపడ్డారు.
కదిరి టిడిపి ఎమ్మెల్యే టికెట్ అత్తర్ చాంద్ బాషాకి ఇవ్వాలని చాంద్ బాషా అనుచరులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని పక్షంలో ఎంపీ టికెట్ ఇచ్చిన పోటీ తమ సిద్ధమని ఈ సందర్భంగా చాంద్ భాష వర్గం తెలియజేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజవర్గంలో మైనార్టీకి టికెట్ కేటాయించిందని, దానిని దృష్టిలో పెట్టుకొని తమ నాయకుడికి టికెట్ కేటాయించాలని నారా లోకేష్ ని కోరారు.
కాగా ఇప్పటికే టిడిపి కదిరి టికెట్ ని టీడీపీ మాజీ శాసనసభ్యుడు కందికుంట వెంకటప్రసాద్ సతీమణి కందికుంట యశోదమ్మకి కేటాయించింది టీడీపీ అధిష్టానం. 2014 ఎన్నికల్లో తన చేతిలో ఓటమి పాలైన కందికుంట కుటుంబానికి టికెట్ కేటాయించడం ఏంటి అని అత్తార్ చాంద్ బాషా నారా లోకేష్ ని ప్రశ్నించారు. 2019 ఎన్నికలలో 30 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన వ్యక్తి కుటుంబానికి ఏ ఆధారంగా టికెట్ కేటాయించారు అని అత్తర్ చాంద్ భాషా వర్గీయులు నారా లోకేష్ ని అడిగారు.
నారా లోకేష్ తెలివిగా తన చేతిలో ఏం లేదని అంత టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతిలో ఉందని అక్కడి నుంచి జారుకున్నాడు. అత్తర్ చాంద్ భాషా కి టికెట్ దక్కని యెడల టిడిపి ఓటమికి కృషి చేస్తామని నారా లోకేష్ ఎదుటే అత్తర్ వర్గం కొండ బద్దలు కొట్టి చెప్పింది. కదిరి నియోజవర్గం నాయకులతో పాటు, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కోట్ల సుజాతమ్మకి ఆలూరు టికెట్ కేటాయించాలని టీడీపీ శ్రేణులు, తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి సుగుణమ్మకి సీట్ కేటాయించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు.