ఎన్నికలు మొదలవుతుండగా జరిగే సర్వేల కోసం రాజకీయ పార్టీలు, నాయకులు, ఓటర్లు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక రకంగా ఎన్నికలకి ప్రీ ఫైనల్ రిజల్ట్స్లా ఈ సర్వేలను భావించొచ్చు. మరీ బొత్తిగా రాజకీయ నాయకుల చేతిలో ఉన్న మీడియా సంస్థలు చేసే సర్వేలు తప్ప, మిగిలినవన్ని నిస్వార్థంగానే సర్వే ఫలితాలను చెప్తూ ఉంటాయి.
అటువంటి సర్వేలు మరొకసారి చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నాయి. 2019 ఎన్నికల ముందు వచ్చిన సర్వేలలో టీడీపీ తక్కువగానే స్కోరు చేయబోతోంది అనే ఫలితాలు వచ్చినా… దానిని కూడా తనకు అనుకూలంగా మార్చుకుని ఎల్లో మీడియాలో వేయించుకున్నారు చంద్రబాబు. మోడీ – షా కు వ్యతిరేకంగా చంద్రబాబు వెళ్తున్నారు కాబట్టీ, ఢిల్లీలో మోడీని అష్ట దిగ్బంధనం చేయడం వల్ల… వాళ్ళ తాలూకా సంస్థలతో ఇటువంటి సర్వే ఫలితాలను విడుదల చేసి బాబు ఆత్మవిశ్వాసంపై కొట్టాలని చూస్తున్నారనీ, అసలు పోల్ మేనేజ్మెంట్లో బాబుని మించిన మొనగాడు లేడనీ ఇలా ఎన్నో రకాల వార్తలతో ప్రజల దృష్టి ఆ సర్వేలపై పడకుండా విశ్వ ప్రయత్నాలు చేసారు. చివరికి బెడిసి కొట్టాయి అనుకోండి అదే వేరే విషయం.
ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికల వేళ, ఒక ప్రతిష్ఠాత్మకమైన జాతీయ సంస్థ తరఫున సర్వే పర్యవేక్షణకు వచ్చిన ఒక కీలక వ్యక్తి అంచనా ప్రకారం, అన్ని నియోజక వర్గాల్లో YCP కి 50 శాతం పైనే మద్దతు ఉందనీ,
100 పైగా నియోజక వర్గాల్లో 55 శాతం మద్దతు ఉందనీ, పురుషుల్లో కంటే పధకాల వల్ల లబ్ది పొందిన మహిళల్లో మద్దతు ఎక్కువ ఉందనీ తెలిపారు.
ఇవే కాక, ఇటీవల వచ్చిన చాలా వరకూ సర్వెలలో టీడీపీ 45 కి మించి సీట్లను గెలుచుకోలేదు అని కూడా వచ్చింది. బాబు – పవన్ నిలకడ లేని పొత్తు రాజకీయాలు, కాపుల అలక, జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు మొదలగు కారణాల వల్ల వైసీపీ ప్రతి సర్వేలోనూ ముందంజలో ఉంది. బీజేపీ ఒంటరి పోరుకు వెళ్లనుందని, వైసీపీకి మెజారిటీ అని స్పష్టంగా ఉండటంతో టీడీపీ జనసేన అయోమయంలో పడ్డాయి. బీజేపీ ఒంటరి పోరుకు వెళ్ళడానికి సుముఖంగా ఉండటం కూడా చంద్రబాబుకు సంకటంగా మారింది. మరి ఈ సారి వచ్చిన సర్వేలతో బాబు ప్రజలను ఏ రకంగా మభ్య పెడతారో చూడాలి మరి!