తరాలుగా కులం పేరుతో వివక్షను ఎదుర్కొంటునైన దూదేకుల కోసం జగన్ ప్రభుత్వం వివక్షని అరికట్టడం కోసం నిర్ణయం తీసుకుంది సుర్బాషా(దూదేకుల)ను కులం పేరుతో దూషిస్తే శిక్ష తప్పదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దూదేకులను అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తే ఐపీసీ సెక్షన్ 1880 ప్రకారం చర్యలు తీసుకుం టామని ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రకమైన వివక్షపై ఎన్నో ఏళ్ళ నుండి పోరాటం చేస్తూ, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా, వారి విజ్ఞప్తి మేరకు రజకులకు మాదిరిగానే దూదేకులకు కూడా చట్టాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని శాఖల అధిపతులకు, జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు ఏపీ బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సినిమాలలోనూ, దైనందిన జీవనంలోనూ దూదేకులను ఉద్దేశించి తరచూ వివక్షతో కూడిన మాటలు తరాలుగా వినీ వినీ విసిగిపోయిన తమ విజ్ఞాపనను పరిగణనలోకి తీసుకుని పెద్ద మనసుతో ఉత్తర్వులు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని ముస్లిం దూదేకుల పాలిటికల్ జేఏసీ. రాష్ట్ర అధ్యక్షుడు షేక్ దస్తగిరి అన్నారు. రెండు దశాబ్దాలుగా ఈ విషయమై అనేక పోరాటాలు చేశామన్నారు. తమ ఆవేదనను సీఎం వైఎస్ జగన్ అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఇకపై సినిమాల్లోను, సమాజం లోను దూదేకులను తిడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీచేయడంపై సీఎం వైఎస్ జగన్కు దస్తగిరి కృతజ్ఞతలు తెలిపారు. నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు షేక్ సలీమ్ కూడా మరో ప్రకటనలో సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు.