మొదటి రెండు సిద్ధం సభలు సక్సెస్ అయిన నేపథ్యంలో వైసీపీ వర్గాలు ఇప్పుడు మరింత ఉత్సాహంగా రాప్తాడు సభను నిర్వహించబోతున్నారు. ఒకరకంగా ఈ సభ రాబోవు ఎన్నికలకు లాంచింగ్గా భావిస్తున్నారు. ఈ సభ నుంచే సీయం జగన్ 2024 ఎన్నికలకు మేనిఫెస్టోని విడుదల చేయనున్నారని వైసీపీ వర్గాలలో చర్చ నడుస్తోంది.
రాష్ట్రం యావత్తూ ఈ సభకై ఎదురు చూస్తున్నవేళ, ప్రకటించనున్న మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ఉండబోతుందా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే తాను అమలు చేయలేని హామీని ఇవ్వలేనని 2014 లో జగన్ తన మేనిఫెస్టో విడుదల సందర్భంగా చెప్పిన సంగతి తెలిసిందే. చాలా సార్లు దానిని ప్రస్తావిస్తూ అప్పుడు కనుక రుణమాఫీ చేస్తానని అమలు చేయలేని హామీని ప్రకటించి ఉంటే ఖచ్చితంగా అధికారం వచ్చి ఉండేదని అన్నారు.
మరి ఇప్పుడు జగన్, 2019 లో తాను చేస్తానన్న హామీలలో రైతు భరోసా, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, పెన్షన్ పెంపు ఇలా 99 శాతం నెరవేర్చి, షుమారు మూడు లక్షల కోట్ల రూపాయల మేర పేద లబ్దిదారులకు అందేలా చేసారు జగన్. జగన్ చెబితే చేస్తాడు అనే ఇమేజిని ప్రజల్లో సంపాదించుకున్నారు.
అలాగే అభివృద్ధి పరంగా చూస్తే కోస్తాలో సువిశాల తీర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా పది ఫిషింగ్ హార్బర్ లు, సీ పోర్టులు, అన్ని హార్బర్ లను కలుపుతూ రోడ్డు ఇలా తీర ప్రాంతాన్ని మణిహారంలా తీర్చిదిద్దారు, ఉద్దాణం ప్రజల కోసం కిడ్నీ వ్యాధుల ఆసుపత్రి, దాదాపు 800 గ్రామాలకు సురక్షిత త్రాగు నీటి ప్రాజెక్టు నిర్మాణం ద్వారా దశాబ్దాల సమస్యకు చెక్ పెట్టే దిశగా పయనిస్తున్నారు,
రాయలసీమ పరంగా చూస్తే వెలిగొండ రెండు టన్నెల్ల నిర్మాణం పూర్తి చేయటంతో పాటు, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుంది,
రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల ఏర్పాటుతో ప్రభుత్వ సేవల్ని మారుమూల ప్రాంత నివాసితుల గుమ్మం ముందుకు తీసుకురావటం, కరోనా సమయంలో చేసిన కృషి, విద్యా రంగంలో తీసుకువచ్చిన పెను మార్పులు దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచంలో పలు దేశాల నుండి ప్రశంసలు రావడంతో బాటు కొన్ని దేశాలు తాము కూడా ఇలాంటి పధకాలు అమలు చేయాలని అధ్యయన కేంద్రంగా రాష్ట్రాన్ని ఎన్నుకొనే విధంగా తీర్చిదిద్దాడు అని చెప్పవచ్చు .
ఈ నేపథ్యంలో కేవలం అయిదేళ్లలో ఇన్ని పధకాలు విజయవంతంగా అమలు చేసాక, రాబోతున్న ఎన్నికల ముందు ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న ఈ సభలో మేనిఫెస్టో ప్రవేశపెడతారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అందులో రైతు రుణమాఫీ ఉంటుందా లేదా, ఇతర అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఏమేం నిర్ణయాలు ప్రకటిస్తారో అని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .
అంతిమంగా చూస్తే మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్లలా పవిత్రంగా భావించే జగన్, తనకు ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే అందులో పొందుపరుస్తారని, ప్రకటించినవి ఖచ్చితంగా అమలు చేస్తారనే నమ్మకం ప్రజల నుంది పొందడంలో విజయవంతమయ్యారు జగన్