గీతాంజలి విషయంలో తెలుగుదేశం, జనసేన తమ వైఖరిని మార్చుకోలేదు. వారిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నా అసత్యాలు ప్రచారం చేసే పనిలో పడ్డాయి. ఎవరో తోసేశారని ఎడిటెడ్ వీడియో వదిలి వైఎస్సార్ కాంగ్రెస్పై నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా జన్మభూమి ఎక్స్ప్రెస్ లోకో పైలట్ విజయ్రామ్ వాంగ్మూలాన్ని జీఆర్పీ పోలీసులు రికార్డు చేశారు. ఇందులో అనేక విషయాలు వెలుగు చూశాయి.
ప్రభుత్వ ఆదేశాలతో గీతాంజలి కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. టీడీపీ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో తెనాలి డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. సీసీ కెమెరాలున్నాయా అని ఆరాతీశారు. కాగా లోకో పైలట్ విజయ్రామ్ స్టేట్మెంట్ ఇలా ఉంది. ‘గుంటూరు నుంచి 12.05 గంటలకు తెనాలి రైల్వే స్టేషన్కు వచ్చే సరికి అప్పటి వరకు ఫోన్ మాట్లాడుతూ ట్రాక్ పక్కన నిలబడిన మహిళ ఒక్కసారిగా కదిలింది. ఉన్నట్టుండి ట్రాక్పైకి వచ్చేసింది. నేను అరుస్తూ ఎమర్జెన్సీ బ్రేక్ వేసే ప్రయత్నం చేశాను. అప్పటికే ఇంజిన్ ఆమెకు తగిలి తీవ్రంగా గాయపడింది. వెంటనే ప్రయాణికుల సహకారంతో స్టేషన్ మాస్టర్కు అప్పగించాం.’ కానీ టీడీపీ, జనసేన సైకోలు బీసీ మహిళ చనిపోయిన తర్వాత కూడా వదలకుండా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించడం విమర్శలకు దారి తీసింది.
పచ్చమూకలకు ఇదేమి కొత్త కాదు. 2015 సంవత్సరంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని బీసీ అయిన ఎం.రిషితేశ్వరి ర్యాగింగ్ భరించలేక హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణమైన ప్రిన్సిపల్ జి.బాబురావు, వర్సిటీలోని ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చినా నాటి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం పట్టించుకోలేదు. అసెంబ్లీ సాక్షిగా నిలదీసినా లెక్క చేయలేదు. యూనివర్సిటీలో ఎవరూ ఉద్యమం చేయకుండా ఉన్నతాధికారులు విద్యార్థి సంఘాలను నిషేధించారు.
మహిళలంటే తెలుగుదేశం, జనసేన పార్టీలకు మొదటి నుంచి చిన్నచూపే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలు చాలా దారుణంగా వ్యవహరిస్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఎవరైనా అనుకూలంగా పోస్టులు పెడితే అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతుంటారు. తమ అధినేతల ప్రోత్సాహం ఉండడంతో వారు మరింతగా రెచ్చిపోతుంటారు. దీనికి ఫుల్స్టాప్ పడకపోతేవారి అకృత్యాలకు గీతాంజలిలా మరొకరు ఆత్మహత్య చేసుకోవడం ఖాయం.