ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజును విడతల వారీగా అందిస్తూ విద్యార్థులకు ఉన్నత చదువులను అందించడమే లక్ష్యంగా జగన్ సర్కారు అమలు చేస్తున్న పధకం “విద్యా దీవెన”. విడతల వారీగా ఇప్పటి వరకూ పేద ప్రజల ఖాతాల్లోకి 57 నెలలుగా సుమారు 72919 కోట్ల రూపాయలను జమ చేసారు.
ఈ రోజు కూడా జగన్ కృష్ణా జిల్లా పామర్రు నుంచి బటన్ నొక్కి 708 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. పేద ప్రజలకు ఖరీదైన చదువులను అందుబాటులోకి తెచ్చి ఉంచడమే ఈ పధకం ప్రధాన లక్ష్యం. అయితే ఏం చేసినా విజనరీ అని చెప్పుకునే బాబు ఏనాడూ విద్యార్థులకై ఉపయోగపడ్డ పధకాలు పెట్టిన పాపాన లేదు. వాళ్ళకి ఓట్లు ఉండవు కదా. ఇంకేం అవసరం వాళ్ళతో అనే ఉద్దేశ్యమేమో.
రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పధకానికి కూడా, అధికారంలోకి రాగానే సవాలక్ష రూల్స్ పెట్టి పధకం అమలుకు తూట్లు పొడిచారు బాబు. ఈ విషయమై మోహన్బాబు రోడ్డెక్కి మరీ నిరసన చేయడం మనకు ఇంకా గుర్తే. తండ్రి వైయస్ బాటలో జగన్ నడుస్తూ పేద ప్రజల కోసం ఎన్నో పధకాలను తెస్తుంటే, తాను మాత్రం తన తండ్రి బాటలో ఎందుకు నడవకూడదు అనుకున్నాడేమో లోకేష్.… ఆయన కూడా 2024 లో టీడీపీ అధికారంలోకి వస్తే విద్యా దీవెన పధకాన్ని రద్దు చేస్తానని అన్నాడు.
ఎక్కడ పేద ఫ్రజలకూ ఉచిత విద్య దొరికి అందరూ విద్యావంతులైపోతే… తాము చెప్పే అబద్దాలను పసిగట్టేస్తారేమో అన్న భయం ఈ పెత్తందారీ మనుషులైన తండ్రీ కొడుకులిద్దరికీ అంటుకున్నట్టు ఉంది. సరిగ్గా పేద విద్యార్థులకు అమలయ్యే పధకాల దగ్గరే వాళ్ళ బుధ్ధి చూపించుకుంటున్నారు.