సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేశారు. విత్తు నుంచి పంట విక్రయాల వరకూ అడుగడుగునా అన్నదాతలకు అండగా ఉంటున్నారు. గ్రామస్థాయిలోనే సేవలందించేలా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేసి సాగులో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
ఒకప్పుడు ఇలా..
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విత్తనాలు, ఎరువులు కావాలన్నా, రైతులకు ఏ అవసరమొచ్చినా మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కిలోమీటర్ల దూరంలోని గోదాముల నుంచి ఎరువులు తెచ్చుకునేందుకు రవాణా భారం తడిసిమోపెడయ్యేది. అన్నదాతల సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదు.
నేడు ఇలా..
వ్యయప్రయాసలు తగ్గించేలా, సత్వరమే సేవలందించేలా సీఎం జగన్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు సంకల్పించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల సేవలను అందించే లక్ష్యంతో ప్రతి గ్రామంలో వీటిని పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేయడం ద్వారా 42 లక్షల మందికి పైగా రైతులకు మేలు కలుగుతోంది.
వరండా, సిబ్బంది కోసం రెండు గదులు, రైతులతో సమావేశాల నిర్వహణ కోసం విశాలమైన హాలుతో ఈ భవనాలను డిజైన్ చేశారు. వరండాలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలు, అర్హులు, ఆనర్హుల జాబితాల డిస్ప్లే, రాయితీపై ఇచ్చే విత్తనాలు, బయో ఫెర్టిలైజర్స్, ఇతర ఎరువులు, మరోవైపు భూసార పరీక్షల నమూనా తదితరాలను ప్రదర్శించడం, హాల్లో కియోస్కో, లైబ్రరీ ర్యాక్స్, రైతులు కూర్చుని చదువుకునేందుకు వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు.
దేశానికే ఆదర్శం
సబ్సిడీపై విత్తనాలు, ఎరువులతోపాటు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట నష్టం వాటిల్లితే బీమా పరిహారం అందించడంలో ఆర్బీకేలు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. సాగు కాలంలో రైతుకు రవాణా, కూలీ ఖర్చుల రూపంలో వేలాది రూపాయలు ఆదా చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది ఈ వ్యవస్థ. వీటిని తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే దిశగా రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందాలు జిల్లాలకు వెళ్లి సందర్శించాయి.
సేవలిలా..
ఆర్బీల ద్వారా అన్నదాతలకు విస్తృతమైన సేవలు అందుతున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందుబాటులో ఉంచుతున్నారు. పంట నమోదు ద్వారా ఉచిత పంటల బీమా, సున్న వడ్డీ రుణాలు అందిస్తున్నారు. అర్హులైన రైతులకు రైతు భరోసా, పీఎం కిసాన్, కౌలు రైతు భరోసా పథకాల నమోదు జరుగుతోంది. ధాన్యం కల్లం వద్ద నుంచి మిల్లుకు చేరే వరకూ దళారుల బెడద లేకుండా రైతులకు సహకారం అందిస్తున్నారు. పంట కోత ప్రయోగాలు, పంట నష్టపోతే బీమా అంచనాలు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణాల మంజూరు చేస్తున్నారు. వైఎస్సార్ పొలంబడి ద్వారా రైతులకు సూచనలు, సలహాలిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేలా చైతన్యవంతం చేస్తారు. సమస్యలు గుర్తించేందుకు ప్రతినెలా గ్రామ వ్యవసాయ సహాయక మండలి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సీజన్లో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపపడుతున్నారు. వైఎస్సార్ యంత్ర సేవ పథకం ద్వారా రైతులకు యంత్ర సామగ్రిని అందజేస్తున్నారు.
జగన్ సాయం ఇలా..
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు చాలా రకాలుగా సాయం చేశారు. ఇందులో ఒకటి వైఎస్సార్ రైతు భరోసా. సాగు విషయంలో సాయం చేసేందుకు శ్రీకారం చుట్టిన పథకం. ఇందులో భాగంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. దీని లబ్ధిదారులు 53,52,905 మంది. ఖర్చు పెట్టిన మొత్తం రూ.33,299.80 కోట్లు. ఇంకా వివిధ కార్యక్రమాలకు సర్కారు పెద్ద మొత్తంలో నగదు వెచ్చించింది. అందులో వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు ఒకటి. దీని లబ్ధిదారులు 73,87,602 మంది. అందించిన నగదు రూ.1,834.55 కోట్లు. మరో పథకం వైఎస్సార్ ఉచిత పంటల బీమా.. దీని కింద లబ్ధి పొందింది 54,75,651 మంది. ఖర్చు పెట్టిన మొత్తం రూ.7,802.05 కోట్లు. మరో పథకం ఇన్పుట్ సబ్సిడీ.. దీని లబ్ధిదారుల సంఖ్య 22,84,841 మంది. ఖర్చు చేసిన నగదు రూ.1,976 కోట్లు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ ఈ స్థాయిలో సాయం చేయలేదు.