తాను అధికారంలోకి మళ్లీ వస్తే రాయలసీమను కోనసీమ చేస్తా అని మళ్లీ హామీ ఇచ్చాడు.. ఈ మళ్లీ హామీకి ఎన్నిసార్లైనా ముక్తి మాత్రం ప్రసాదించడు..
2019 వరకు మొత్తంగా 14 ఏళ్లు సీఎం గా ఉండి రాయలసీమను కోనసీమగా ఎందుకు చేయలేకపోయారు బాబూ అంటే మాత్రం సమాధానం ఉండదు. 1995 లో మొదటి సారి సీఎం అయిన బాబు ఆయన 9 ఏళ్ల పాలనలో రాయలసీమకు ఒక్క నీటి చుక్క ఇవ్వడానికి కూడా ఏ ప్రాజెక్ట్ కట్టని బాబు. రాయలసీమకు నీరందించే ఏ ప్రాజెక్టు కు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని బాబు వైయస్సార్ హయాంలో జలయజ్ఞం లో భాగంగా పూర్తి చేసిన ప్రాజెక్ట్ లకు ప్రారంభోత్సవ శిలాఫలకాలు వేయడానికే తన 2014-19 మధ్య కాలం సరిపోయింది. ప్రాజెక్ట్ ల శంకుస్థాపన కోసం ఓ శిలా ఫలకం, ప్రారంభోత్సవానికి ఒక శిలాఫలకం తప్ప ఆ మధ్యలో ఏ ప్రాజెక్టు కు తానో రూపాయి కేటాయింపు కూడా చేయడు. పైపెచ్చు తను శిలాఫలకాలు వేసిన ప్రాజెక్ట్ లకు కేంద్రం అనుమతులు ఇవ్వదు అనే అర్థం లేని సాకులు చెప్పి, మాకు ఎలాంటి అనుమతుల ప్రతిపాదన బాబు నుండి రాలేదని కేంద్రం సమాధానం ఇచ్చేవరకు తెచ్చుకుంటాడు.
పైపెచ్చు అప్పటికే కట్టి నీటి నిల్వ ఉంచిన ప్రాజెక్ట్ ల నుండి నీరడిగిన రైతులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇప్పుడు నీళ్లు ఇస్తే మళ్లీ మళ్లీ అడుగుతారు, రైతులకు క్రమశిక్షణ లేకుండా పోతుంది అని ఏహ్యమైన మాటలు మాట్లాడటం అధికారంలో ఉన్నప్పుడు బాబుకు పరిపాటి. అదే అధికారం కోల్పోగానే అవ్వాలి చెల్లికి పెళ్లి మళ్లీ మళ్లీ అన్నట్లుగా, రాయసలసీమని కోనసీమ చేస్తా, రాయలసీమను సస్యశ్యామలం చేయడమే నా కల అంటూ ఇచ్చిన హామీలే మళ్లీ మళ్లీ ఇస్తుంటాడు. రైతులన్నా, వ్యవసాయం అన్నా, నీటిపారుదల ప్రాజెక్ట్ లు అన్నా అసలే అవగాహన లేని బాబు, తన 14 ఏళ్ల సీఎం హోదాలో ఒక ప్రాజెక్టు కు శంకుస్థాపన చేసి, అనుమతులు సంపాదించి, ప్రాజెక్ట్ ను పూర్తి చేసి, ప్రారంభోత్సవం చేసిన ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు అంటే అర్థం చేసుకోవచ్చు బాబు చిత్తశుద్ధి ఏమిటని…