మనసులేని మామ అనే కథనంతో సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్టల్స్ లో సరి అయిన వసతులు లేవంటూ ఈనాడు ఓ అసత్య కథనం ప్రచురించింది.
నిజానికి 2019 లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విద్యా విధానంతో పాటు విద్యార్ధులకు కల్పించే సౌకర్యాలలో కూడా చాలా మార్పు వచ్చింది. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు(హాస్టల్స్)లో విద్యార్థులు మరింత క్షేమంగా ఉండేలా ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సన్నాహక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో 3,783 హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు.
బలహీన వర్గాల పిల్లల సంక్షేమంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చిత్తశుద్ధిని చాటుకుంది. ఫిబ్రవరి, 2023 లో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచింది. నిజానికి.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ చార్జీలను 2012లో పెంచారు. అప్పటి నుంచి ఆరేళ్లపాటు వాటిని పట్టించుకున్న నాధుడే లేడు. 2018 లో చంద్రబాబు ప్రభుత్వం పెంచినప్పటికీ అవి సరిగ్గా అమలు కాలేదు. తరువాత వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత చేస్తున్నా ఎప్పటికప్పుడు దేనికో ఒకదానికి ఏడ్చే రామోజీ.. ఇప్పుడు సంక్షేమ హాస్టళ్ళలలో వసతుల కొరత అంటూ కొత్త ఏడుపురాగం అందుకున్నారు. అయితే సంక్షేమ హాస్టళ్ళలో చంద్రబాబు నాయుడు కట్టించిన వసతులనేమైనా జగన్ వచ్చి కూల్చారా…? లేక బాబు మంచాలు ఇస్తే జగన్ తీసేయించారా ? లేక బాబు బాగు చేయించిన హాస్టళ్ళను జగన్ ఏమైనా ఖాళీ చేయించారు..? 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఏం చేశాడో ఎప్పుడూ ప్రస్తావించని ఈనాడు.. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లుతుంది.. సంక్షేమ హాస్టళ్ళు పరిస్థితి అని రాసేముందు నాడు- నేడు కింద బాగైన స్కూళ్ళ గురించి ఈనాడు ఏనాడైనా రాసిందా.. ??? నాడు నేడు క్రింద మొత్తం 61 ,661 స్కూల్స్ ,కాలేజీలు , హాస్టల్స్ కోసం 16 , 451 కోట్ల ఖర్చు చేస్తోంది జగన్ ప్రభుత్వం. నాడు-నేడు తొలి దశ పనులు పూరై దాదాపు 15000 పాఠశాలలు బాగుపడ్డాయి.. ఆ విషయం గురించి ఈనాడు ప్రస్తావించలేదే.. ఇప్పుడు నాడు నేడు క్రింద 1,668 హాస్టళ్లను 834 కోట్లు పెట్టి బాగుచేయిస్తున్నారు ముఖ్మమంత్రి వైఎస్ జగన్.
40 ఏళ్ళ రాజకీయ అనుభవం.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు విద్యా వ్యవస్థకు చేసిన సహాయం ఇది అని చెప్పుకునే సత్తా ఉందా.. పోనీ చంద్రబాబు రాష్ట్ర పిల్లల భవిష్యత్తుకై ఏం చేశారో చెప్పే దమ్ము ఈనాడు రామోజీకి ఉందా.. లేదు.. ఎందుకంటే బాబు ఎప్పుడు విద్యా వ్యవస్థను పట్టించుకోలేదు.. వాస్తవానికి చంద్రబాబు విద్య ప్రభుత్వ బాధ్యత కాదంటూ భావితరాల భవిష్యత్తును గాలికి వదిలేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు గాడి తప్పిన విద్యా రంగాన్ని సరిచేస్తూ చదువుల విప్లవాన్ని తీసుకువచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం. అమ్మ ఒడి, విద్యా కానుక, ఇంగ్లీషు మీడియం, ట్యాబులు.. అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంతకుముందెన్నడూ లేని విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. రానున్న రోజుల్లో సంపూర్ణంగా ఒక తరాన్ని నిర్మించిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుంది.