జగన్ పేరు చెప్పుకుని నేను గెలవడం ఏంట్రా ఇడియట్స్, నా సొంత బొమ్మ మీద గెలిచా. నా స్థాయి ఏంటో తెలుసా, నా అంతస్తు మీకేమైనా అర్థం అవుద్దా అంటూ తనో తల పండిన రాజకీయవేత్త లాగా తనను తాను భావిస్తూ, బీజేపీ పెద్దలు తనకు నిత్యం టచ్ లో వుంటారని, సీబీఐ, ఈడీ లు ఎప్పుడు ఎవరి మీద దాడులు చేస్తారో తనకు ముందే తెలిసిపోతుంది అనీ, రాష్ట్ర రాజకీయాలను ఢిల్లీ నుండి ఏలుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చే రఘురాం రాజు చివరికి “ఉండి” టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా మిగిలిపోయాడు…
పొత్తులో ఎవరు పోటీ చేసినా చేయకపోయినా, నర్సాపురం ఎంపీ గా పోటీ చేయబోయేది నేనే, అంటూ రెండు పార్టీ ల అధ్యక్షుల ముందే తనను తాను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించుకున్న రఘురాం రాజు బీజేపీ తనకు టికెట్ ఇస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉండగా, నీకసలు ప్రాథమిక సభ్యత్వమే లేదు, నీకూ మాకే సంబంధం లేదు అని బిజెపి నర్సాపురం టికెట్ ను నిరాకరించగా, ఏడ్చి పెడబొబ్బలు పెట్టి, జగన్ పై నిందలు వేసి గగ్గోలు పెట్టినా బీజేపీ పట్టించుకోదు, తనకు నర్సాపురం టిక్కెట్టు దక్కదు అని తత్వం భోధపడినట్లుంది, తన జాతీయ స్థాయి ఊహలని ఒక్కసారిగా పక్కనబెట్టి “రోడ్ షో లో బాబు ప్రచారం వాహనం మీద కండువా కప్పించుకుని” టీడీపీ లో అధికారికంగా జాయిన్ అయ్యాడు రాజు.. ఇక తనకు గత నాలుగున్నర ఏళ్ల నుండి “రకరకాల” సేవలందించిన కృతజ్ఞత తో బాబు దయతలచి ఉండి శాసన సభ స్థానం రఘురామ రాజు కు కేటాయించాడు… ఇప్పటికే ఉండి ఇంచార్జ్ గా ఉన్న రామరాజును తప్పించి రాజు కు టికెట్ కన్ఫర్మ్ చేశాడు బాబు…
ఇక ఇక్కడ గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుంటే “ఉండి” టీడీపీ కంచుకోటగా ఉంది. 1983 తర్వాత కేవలం 2004 లోనే టీడీపీ ఆ స్థానం కోల్పోయింది. వైసీపీ ఇంతవరకు అక్కడ గెలవనేలేదు. అలాంటి స్థానం నుండి రఘురామ రాజు పోటీ చేయడం వైసీపీ ని పెద్దగా ఆశ్చర్యపరచలేదు. అందుకే ముందుగానే అక్కడ మంచి ప్రణాళికలతో సిద్ధంగా ఉంది. పైపెచ్చు అక్కడ టీడీపీకి స్ట్రాంగ్ అభ్యర్థి అయిన కలవపూడి శివ ను కాదని రామరాజుకు ఇవ్వడం, ఇప్పుడు అతన్ని కూడా తప్పించి రఘురామ రాజుకు ఇవ్వడం వలన కలవపూడి శివ, రామరాజు వర్గీయుల నుండి సహకారం అందకపోవచ్చు. ఇప్పటికే రామరాజు వర్గీయులు ఆందోళన బాట పట్టారు…
ఏమైనా జాతీయ స్థాయి మనిషిని, ఎవరి బొమ్మతో గెలవలేదు అని ఎచ్చులు మాటలు మాట్లాడే రఘురామరాజు కు ఈసారి ఎమ్మెల్యే గా గెలవడం కూడా అయ్యేపనిలా లేదు. తన కంచు కోటలో టీడీపీ కూడా ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి…