రైతులకు అండగా నిలుస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వరుసగా ఐదో ఏడాది పెట్టుబడి సాయంగా అందిస్తున్న వైఎస్సార్ రైతు భరోసా నగదును రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి జరిగిన వర్చువల్ సమావేశంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు కొందరు రైతులు మాట్లాడారు. వారు ఏమన్నారంటే..
దేశం గర్వించే విధంగా సంస్కరణలు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం – కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
ఈ రోజు వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద రైతు భరోసాకు సంబంధించి సీఎంగారు ఇచ్చిన హామీ రూ. 50 వేలు ఇస్తామన్న హామీకి అదనంగా, చెప్పిన దానికన్నా రూ. 17,500 ఎక్కువగా మొత్తం రూ. 67,500 ను ప్రభుత్వం రైతులకు ఇచ్చింది. గత ప్రభుత్వం అనేక హామీలిచ్చి రైతులను మోసం చేస్తే సీఎం జగన్ రైతుల పక్షాన నిలబడి, ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా సంస్కరణలు తీసుకొచ్చారు. ఆర్బీకేలలో కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి. విత్తనం నుంచి విక్రయం వరకు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. పాలకుడు మంచివాడయితే ప్రకృతి కరుణిస్తుందని సీఎం జగన్ గారి మనసు, పాలన బావున్నాయి కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రైతులు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు కరువు కవల పిల్లలు. దేశం గర్వించే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది. మరో మూడు నెలల్లోపు మళ్ళీ జగన్ గారి ఆధ్వర్యంలో రైతు పక్షపాత ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పుడు మరింతగా రైతాంగానికి సేవ చేసే అవకాశం ఉంటుంది, దేశ చరిత్రలో ఏ సీఎం తీసుకోని విధమైన అసాధారణ నిర్ణయాలు రైతుల గురించి ఈ సీఎంగారు తీసుకున్నారు, రైతుల పక్షాన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
రైతులను ముఖ్యమంత్రి జగన్ చేయి పట్టుకుని నడిపిస్తున్నారు – ఎన్. బాబు, రైతు, అనంతపురం జిల్లా
సీఎం జగన్ దేశంలో ఎవరూ చేయని విధంగా ఆర్బీకేలు ఏర్పాటు చేసి విత్తనం నుంచి విక్రయం వరకు అందిస్తున్నారు. ఈ–క్రాప్ వల్ల అన్నీ అందుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ 4 ఏళ్ళలో రూ. 50 వేలు ఇస్తామని అదనంగా రూ. 17,500 కలిపి మొత్తం రూ. 67,500 ఇచ్చారు. మేం పంట వేస్తే మీరు బీమా చెల్లిస్తున్నారు, మా రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ఏ రైతుకు కష్టం వచ్చినా మీరు నేనున్నా అని ముందుకు వస్తున్నారు, నేను సున్నా వడ్డీ కూడా పొందుతున్నాను. మీరు సన్న, చిన్నకారు రైతులకు కూడా వ్యవసాయ పనిముట్లు అందజేసి ఆదుకున్నారు. రైతులకు సలహా మండలి ఏర్పాటు చేసి మాకు చాలా ఉపయోగకరంగా ఉంచారు. గతంలో విత్తనాల కోసం మండల కేంద్రాల్లో పడిగాపులు కాసేవాళ్ళం. కానీ ఇప్పుడు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు ఇస్తున్నారు. గతంలో పాలు కర్ణాటకలో అమ్ముకునేవాళ్ళం కానీ ఇప్పుడు పాల ఉత్పత్తిదారులను మీరు ఆదుకోవడంతో వారు సంతోషంగా ఉన్నారు. నా కుటుంబం ప్రభుత్వం ద్వారా చాలా లబ్ధిపొందింది. నా కుటుంబం మీ నుంచి రూ. 3,42,152 లబ్ధి పొందాను. స్కూల్స్ చాలా బావున్నాయి. నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. అద్భుతమైన దూరదృష్టిగల సీఎం జగన్ మళ్ళీ సీఎంకావాలి. ఆయనను మళ్ళీ సీఎం చేసుకునేందుకు రైతాంగం సిద్దంగా ఉంది
రైతులకు సీఎం జగన్ ప్రణాళికాబద్దంగా సాయం చేశారు – వై.శ్రీనివాసరావు, రైతు, గజపతినగరం, విజయనగరం జిల్లా
నేను 4 ఎకరాల్లో ప్రత్తి, 3 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పండిస్తున్నాను. జగన్ గారి పాదయాత్రలో మా సమస్యలు చెప్పాను. మా సమస్యలు విన్నారు. చూశారు. అప్పుడిచ్చిన మాట ఇచ్చిన ప్రకారం ఒక వ్యవస్ధను తీసుకొచ్చి రైతుల కళ్ళలో ఆనందం చూశారు. రైతులకు సీఎం జగన్ ప్రణాళికాబద్దంగా సాయం చేశారు. మా దిగుబడులు పెరిగాయి, ఈ –క్రాప్ ద్వారా పంట రుణాలు ఇవ్వడం, సున్నావడ్డీ చాలా బాగా ఇస్తున్నారు. గతంలో ఇన్సూరెన్స్ డబ్బు కట్టి చేయించుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు, దేశంలో ఎక్కడా ఈ–క్రాప్ విధానం చూడలేదు. సీఎం జగన్ రైతుపక్షపాతిగా ఉన్నారు. మేం చాలా లబ్ధిపొందాం, నేను 78 బస్తాల ధాన్యం 3 ఎకరాల్లో పండిస్తే రూ. 1,56,000 నేరుగా నా ఖాతాలో జమ చేశారు. నా పిల్లలకు విద్యాదీవెన అందింది. నా భార్యకు అనారోగ్యం వస్తే నేరుగా వైజాగ్ అపోలో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందాం. చికిత్స కింద రూ. 1,48,000 ప్రభుత్వం చెల్లించింది. పైగా తను కోలుకోవడానికి రూ. 4,750 జమ చేశారు, మీరు పెద్ద మనసుతో చాలా సాయం చేస్తున్నారు. నాడు నేడు ద్వారా స్కూల్స్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. అమ్మ ఒడి పథకం చాలా బావుంది, చక్కటి పౌష్టికాహారం ఇస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం చక్కటి కార్యక్రమం, పేదల పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటే వారి భవిష్యత్ బావుంటుందని ప్రపంచ స్ధాయిలో ఎదగాలనే మీ సంకల్పం గొప్పది, విద్య, వ్యవసాయం, వైద్యంలో మీరు చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. సీఎం జగన్ మళ్ళీ సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు.