2024-25 విద్యా సంవత్సరానికి అవసరమైన 4కోట్ల 42 లక్షల పాఠ్యపుస్తకాల ముద్రణ మొదలు పెట్టింది ఏపీ ప్రభుత్వము. ఈ విషయన్ని విద్యా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ప్రకటించారు. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు స్కూల్స్, కాలేజ్ లు మొదలయ్యే మొదటి రోజునే అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుని దానికి అవసరమైన ముద్రణ మొదలు పెట్టారు. దానిని ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా వెళ్ళి పర్యవేక్షణ చేసి పలు సూచనలను అందించారు.
దేశంలోనే మొదటసారిగా మొదటి తరగతి నుండి పదవ తరగతి వరకూ సోషల్, సైన్స్, గణితం తదితర సబ్జెక్ట్ పుస్తకాలను బైలింగువల్ అనగా ఒకవైపు తెలుగు మరోవైపు ఇంగ్లీష్ లో ప్రింటింగ్ చేసి ఇచ్చే ఏకైక విద్యాశాఖ ఆంధ్ర ప్రదేశ్ మత్రమే అని విద్యా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.ఇక అదే సమయంలో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు టోఫెల్ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మరింత మంచిగా సన్నద్దమయ్యే విధంగా టోఫెల్ వర్క్ బుక్స్ ను కూడా అందించనున్నారు .
వీటితో పాటు 2014-25 విద్యా సంవత్సరానికి మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొదటి సారిగా 8వ తరగతి విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్ అనే ఒక సబ్జెక్టును ప్రవేశ పెట్టారు, వాటికి సంబంధిన పుస్తకాలను కూడా అందించనున్నారు ఏపీ ప్రభుత్వం వాటికి సంబంధించిన పుస్తకాల ప్రింటింగ్ పూర్తి చేస్తుంది విద్యా శాఖ. ఇక 2023-24 విద్యా సంవత్సరం చివరి రోజు అయిన ఏప్రిల్ 23వ తారీఖున 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాల పిడిఎఫ్ లు విద్యా శాఖ వెబ్సైట్లో ఉచితంగా అందుబాటులో ఉంచనున్నారు. వీటినీ వాణిజ్య పరంగా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.