డా. వైయస్సార్ కడప జిల్లా కేంద్రం కడప లోని వినానాశ్రయం లో 266 కోట్లతో నూతనంగా నిర్మించనున్న టెర్మినల్ కి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.. వార్షికంగా 25 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా కడప వినానాశ్రయం నూతన సొబగులు అద్దుకుంటుంది.. 45 మీటర్ల వెడల్పు, 2,515 మీటర్ల పొడవు గల రన్వే తో విస్తరించనున్నారు. నూతనంగా తలపెట్టిన పనులు పూర్తి అవ్వగానే పీక్ అవర్ సర్వీసింగ్ కెపాసిటీ 1800 మంది ప్రయాణికులుగా ఉండబోతుంది. ముఖ్యమంత్రి జగన్ కృషి వలన 75 కోట్ల వ్యయంతో రన్వే కి అవసరం అయిన స్థలాన్ని సేకరించి ఇచ్చారు.
రన్వే ను పొడగిస్తున్న కారణం చేత ఈ వినానాశ్రయం లో నైట్ ల్యాండింగ్ కు కూడా అవకాశం లభిస్తుంది. ఇప్పటికే నిరంతరాయ సర్వీసుల కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఇప్పటికే ఈ వినానాశ్రయం నుండి ఉడాన్ పథకం కింద ట్రూ జెట్ సంస్థ విమానాలను నడుపుతుంది.. 2022 నుండి ఇండిగో సంస్థ ఈ విమానాశ్రయం నుండి విమాన సర్వీసులను కల్పిస్తుంది.
ప్రధాని వర్చువల్ గా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, కడప ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. ఈ ఎయిర్పోర్ట్ కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ కృషి చేయగా, ఇప్పుడు ఆయన తనయుడు జగన్ మరింత కృషి చేస్తున్నారు అని, ఎయిర్పోర్ట్ వెనుక అటవీశాఖ భూములు ఉండగా వారి అనుమతులు కూడా తీసుకుని భూసేకరణ చేసినట్లు వారు తెలిపారు..