రోడ్లు ఉండవ్, కానీ బిల్లులు ఉంటాయ్, వరదనీటి కాలువలు ఉండవు కానీ బిల్లులు ఉంటాయి, కల్వర్టులు కానీ కట్టినట్లు పేపర్లు ఉంటాయ్, సివరేజ్ పనులు చేయరు కానీ చేసినట్లుగా డబ్బులు మింగేస్తారు, వాకింగ్ ట్రాక్లు వెయ్యరు కానీ వేసినట్లు గా బొమ్మ చూపించి ప్రభుత్వ సొమ్ము కాజేస్తారు…
ఇది బాబు అమరావతి సినిమా. రాజధానిని 76% పూర్తి చేశా, ఓ కొత్త నగరాన్ని శృష్టించా అని చెప్పుకునే బాబు అసలు బాగోతం ఇది. తవ్వుతున్న కొద్దీ పుట్టలు పుట్టలుగా బాబు మరియు తన మంత్రుల అవినీతి చిట్టా బయటపడుతూనే ఉంది. అన్ని ఒకదాన్ని మించి ఒకటి. తాజాగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన కొడుకు శరత్ ద్వారా చేయించిన ఓ అవినీతి బాగోతం బయట పడింది.. పత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ డైరెక్టర్ గా, కుమారుడు శరత్ అదనపు డైరెక్టర్ గా ఉన్న అవెక్సా కార్పొరేషన్ కంపెనీ కి టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టింది. వాటి పనులు చేయకపోయినప్పటికీ, చేసినట్లు గా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించిన అవెక్సా కంపెనీ బిల్లులు డ్రా చేసుకోవడంతోపాటు జీఎస్టీ విభాగం నుంచి అడ్డగోలుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని కూడా పొందింది.
తీరా చూస్తే ఒక్క పనీ చేయలేదు. ఒక్క రోడ్డు వెయ్యలేదు.. అన్ని బోగస్ పత్రాలు బిల్లులు శృష్టించి దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు మింగేశారని తేలింది..
ఇలా మంత్రులు, ఎమ్మెల్యే లు, వారి కొడుకులు ఇష్టారీతిన అమరావతి పేరు మీద కోట్లకు కోట్లు దోచేసారు. ఇక బాబు అవినీతికి అయితే అడ్డే లేదు. అందుకే తెల్లారి లేస్తే వేరే సమస్యే లేదన్నట్లు అమరావతి అంటూ నానాయాగి చేస్తారు. వేల ఎకరాలు మింగింది చాలక కాంట్రాక్టుల పేరుతో ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారు… ఇప్పుడు ఒక్కొక్కటి బయట పడుతుండటంతో భయంతో పరుగులు తీస్తున్నారు…