కాపులు టీడీపీకి ఓటు వేస్తే వంగవీటి మోహన రంగా ఆత్మ బాధపడుతుందని ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. వంగవీటి రంగా చాల మంచోడని, నేను కమ్మ కులానికి చెందిన వాడినైనా కానీ స్టూడెంట్ ఎన్నికల్లో నన్ను సపోర్ట్ చేసి ఆదరించాడని, తమ్ముడిలా చూసుకున్నాడని సోమవారం మీడియాకు వెల్లడిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ ‘ మన కమ్మోళ్ళు జనసేనకు ఓటు వేయవద్దని చంద్రబాబు కమ్మ కులం వారికి చెప్పాడు..ఒకవేళ పవన్కి ఎక్కువ ఓట్లొస్తే ఏపీలో 60 – 70 సీట్లు అడుగుతాడని చంద్రబాబు చెప్పడంతో జనసేనకు ఒక్క కమ్మ ఓటు కూడా రాలేదు. తెలంగాణాలో పవన్ కల్యాణ్కు తెలుగుదేశం ఓట్లు పడలేదు కానీ కాపుల ఓట్లు చంద్రబాబుకి వేయిస్తానని పవన్ చెప్పడం సిగ్గుచేటు. కాపులను చంపిన చంద్రబాబుకి పవన్ మద్దతిస్తాడా? అని పోసాని కృష్ణమురళి మండి పడ్డారు.
2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రామోజీరావు చిరంజీవిని పిలిపించి చంద్రబాబు, నువ్వు కలిసి పనిచేస్తేనే వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఓడించగలరు కాబట్టి ఈ ఎన్నికల్లో టీడీపీ కి మద్దతివ్వు అని చెప్పాడు కానీ చిరంజీవి అందుకు ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు . 2009 లో నేను ప్రజారాజ్యం తరపున చిలకలూరిపేటలో పోటీ చేసినప్పుడు, కాపులు రౌడీలు కాబట్టి చిరంజీవి పార్టీకి ఓటు వేయవద్దని ప్రచారం చేయించి చంద్రబాబు ఓడించాడు. కాంగ్రెస్కు తెలంగాణలో మద్దతిచ్చి బీఆర్ఎస్ని చంద్రబాబు ఓడించాలనుకున్నాడు కానీ హైదరాబాద్లోని సెటిలర్లంతా చంద్రబాబును ఛీ కొట్టడంతో కాంగ్రెస్కి ఒక్క సీటు రాలేదు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ అవినీతి పరులని ప్రచారం చేసిన పవన్ చంద్రబాబుకు ఓటు వేయమనడం సిగ్గు చేటని పోసాని కృష్ణ మురళి వెల్లడించారు.