ఏపీ ఎన్నికల్లో సీనియర్ నాయకుల వారుసులు పోటీలో నుంచొని తమ వారసత్వ పరీక్షను ఎదుర్కొంటున్నారు. వారిలో అందరికంటే ఎక్కువగా మచిలీపట్నంలో పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు మీద అందరి దృష్టి నిలిచింది. పేర్ని కిట్టు పేరు మచిలీపట్నం వైసీపీ ఎమ్మేల్యే అభ్యర్ధిగా ప్రకటించిన రోజు టీడీపీ వారు మాకు కిట్టు అసలు పోటీనే కాదు పిల్ల బచ్చా అంటూ చులకనగా తులనాడారు.ఇప్పుడు అదే పిల్ల బచ్చాను చూసి టీడీపీ నాయకులు, వారికి తోడుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి భయంతో వణికిపోతున్నారు. దీనితో తమ అనుకూల మీడియాలో కిట్టు మీద విపరీతమైన ఆరోపణలతో కూడిన వార్తలు వ్రాయిస్తు మరో వైపు కిట్టు ప్రచార రథంపై దాడులకు తెగబడుతూ తమలోని ఓటమి భయాన్ని బయట పెట్టుకుంటున్నారు.
పేర్ని కిట్టు మచిలీపట్నంలో పరిచయం అక్కర్లేని పేరు, కరోన సమయంలో బందరు ప్రజలకు వైసీపీ కార్యకర్తలకు అంతా తానై అండగా నిలిచి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. కరోనా సమయంలో ప్రతి హాస్పిటల్ స్వయంగా తిరుగుతూ ఎవరికి ఏ సహాయం కావాలన్న తన ఫోన్ నెంబరు ఇచ్చి అండగా నిల్చే వారు, అలాగే తుఫాన్ సమయంలో సముద్ర తీర ప్రాంతంలోనీ ప్రజలకు కంటికి రెప్పల తోడుంటూ వచ్చారు. తండ్రి పేర్ని నాని మంత్రిగా తన శాఖ సంబంధిత పనుల్లో బిజీగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని తన భుజస్కందాలపై మోస్తూ ఏక తాటిపై నడిపి అందరి మన్నన పొందారు. ఇది చూసిన పేర్ని నాని ఇక వచ్చే ఎన్నికల్లో బందరు నుండి తనకు కాకుండా తన కొడుకు పేర్ని కిట్టుకి అవకాశం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ ను కోరారు. టికెట్ మీద జరిపిన సర్వేలో కిట్టుకు ప్రజాబలం వుందని తేలడంతో పోటీకి అవకాశం కల్పించారు.
అయితే మొదట కిట్టు వయస్సులో చాలా చిన్నవాడు , పిల్ల బచ్చా అంటూ మాట్లాడిన కొల్లు రవీంద్ర రోజూ రోజుకి పేర్ని కిట్టుకి ప్రజల్లో వస్తున్న స్పందనని చూసి తట్టుకోలేక కుతంత్రాలను తెర లేపారు. బందరు ఆరవ వార్డులో రౌడీ షీటర్ మహేష్ సహకారంతో పేర్ని కిట్టు ప్రచార రథం రౌడీ షీటర్ మహేష్ ఏరియాలోకి రాగానే వైసీపీ మహిళ కార్యకర్తలను అసభ్య పదజాలంతో తిట్టడమే కాక దానిని అడ్డుకున్న వైసీపీ నేతల మీద దాడి చేశారు. దీనితో టీడీపీకి వైసీపీ కి మధ్య పెద్దఎత్తున తోపులాటలు జరిగాయి. వైసీపీ నాయకులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి తమ కార్యకర్తలను అక్కడి నుండి తీసుకువెళ్లారు. అప్పటికే పథకం ప్రకారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం జన సేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి, జన సేన మచిలీపట్నం ఇంచార్జీ రామక్రిష్ణ అందరూ ఒక ఐదు నిమిషాల్లో చేరుకొని పెద్ద ఎత్తున గొడవ చేసి ఎస్పీ ఆఫీస్ లో రచ్చ రచ్చ చేశారు. దీనిపై పోలీసులు స్పందించి ఆ గొడవల మీద విచారణ చేసి అసలు దోషులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
ఇదంతా గమనించిన మచిలీపట్నం ప్రజలు పేర్ని కిట్టు సాధించాడు. తన్ని పిల్ల బచ్చా అన్నా నాయకులనే తన ప్రచారంతో మూడు చెరువుల నీళ్ళు తాపిస్తున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు.