ఏపీ లో 2024 ఎలక్షన్ సందడి మొదలయింది, ప్రధాన పార్టీలు జన సేన, టీడీపీ, బిజెపి కూటమిగా ఏర్పడి ఎలక్షన్ కదన రంగం లోకి దిగాయి. పవన్ కళ్యాణ్ తన పార్టీ జన సేన వాటాగా వచ్చిన 21 సీట్లలో టికెట్ లు చిన్నగా ప్రకటిస్తూ ఇప్పటి వరకూ 18 మందిని ప్రకటించారు. దీనిలో సగం పైనే పక్క పార్టీల నుండి వచ్చిన వారికే టిక్కెట్లు ఇచ్చి తనని నమ్ముకున్న పార్టీ నాయకులకు వెన్నుపోటు పొడిచారు.
ఈ వెన్నుపోటు లో మొదట గురి అయింది సొంత అన్న అయిన నాగబాబునే , అనకాపల్లి ఎంపీ టికెట్ తనకే అని ప్రచారం మొదలు పెట్టిన నాగబాబును పొత్తులో భాగముగా అ సీటు బీజేపికి ఇస్తున్నాం అని చెప్పి మొదటి వెన్నుపోటు పొడిచారు. అక్కడి నుండి మొదలైన వెన్నుపోటుల పర్వం జనసేన పార్టీ కాస్తోకూస్తో బలంగా ఎక్కడ వుందో అక్కడ టీడీపీకి టికెట్ లు వదులుకొని స్థానికంగా పనిచేస్తున్న పార్టీ నాయకులకు వెన్నుపోటు పొడుచుకుంటు వచ్చాడు పవన్.
మంగళగిరిలో జనసేన పార్టీ చేనేత విభాగం అధిపతి మొదలు , మండపేటలో వేగుళ్ళ లీలాకృష్ణ, కాకినాడ సిటీ సరోజ, అనకాపల్లి ఎమ్మేల్యే అభ్యర్ధి భాస్కర్ రావు, ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణ, తిరుపతిలో రాయల్ కిరణ్, హరికుమార్, రాజమండ్రి రూరల్ లో కందుల దుర్గేష్, ఏలూరు, భీమవరం , భీమిలి, గాజువాక, పెద్దాపురం, తణుకు , జగ్గంపేట, కొత్తపేట, చీరాల, గిద్దలూరు, రాజంపేట, చిత్తూరు, నెల్లూరు సిటీ , పెడన, మచిలీపట్నం, మైలవరం, దెందులూరు, పాయకరావుపేట ఇలా ఎక్కడ చూసుకున్నా పవన్ కళ్యాణ్ కోసం, జన సేన పార్టీ కోసం గత పది సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న నాయకులను గాలికి వదిలేసి బాబు స్నేహంతో అబ్బిన వెన్నుపోటును పొడిచి టీడీపీ నుంచి వచ్చిన వారికి, బాబు సూచించిన వారికి టికెట్స్ ఇస్తూ వచ్చాడు పవన్ .
మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయవాడ పశ్చిమ నాయకుడు పోతిన మహేశ్ గురించి, పవన్ కళ్యాణ్ టికెట్ లు ప్రకటించే క్రమంలోనే రెండు సార్లు టికెట్ నీకే ఇస్తున్నాం అని నమ్మించి మోసం చేశారు. అలాగే జన సేన అధినేత 2024 ఎలక్షన్ కి వీళ్ళు పోటీలో ఉంటారు అని ప్రకటించిన మొదటి ఇద్దరు అభ్యర్థులకు కూడా నమ్మించి వెన్నుపోటు పొడిచారు. వారే తణుకు విదివాడ రామచంద్ర రావు, ముమ్మిడివరం పితాని బాలకృష్ణ లు .
కనీసం ఈరోజు వరకు తాను టికెట్ ఇవ్వని నాయకులను పిలిచి మీకు టికెట్ ఇవ్వలేదు దానికి కారణం ఇది అని కూడా చెప్పలేని స్థితి లో పవన్ కళ్యాణ్ వున్నారు. పైగా టికెట్ రాని వారు గొడవలు చేస్తే పార్టీ తరుఫున చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. సొంత అన్న, సొంత పార్టీ నాయకులు, అందునా పవన్ కళ్యాణ్ కష్ట కాలంలో తోడు వున్న నాయకులను పొడిచిన వెన్నుపొట్లతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని మించి పోయారు.