రాజకీయ నాయకులంటే రోజుకో మాట పూటకో అబద్దం చెబుతూ తమకి నచ్చిన సమయానికి నచ్చినట్టు మాట్లాడే మనుషులనే రోజుల నుండి రాజకీయ నాయకుడంటే ఇచ్చిన మాటకి కట్టుబడి చెప్పిన హామీని నెరవేరుస్తూ నిబద్దతతో ప్రజాసేవ చేసే వ్యక్తి అని నిరూపించిన నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ గారు, నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు మాత్రం రోజుకో మాట పూటకో అబద్దం చెబుతూ రాజకీయం అంటే ఇలానే ఉండాలని ఒక గిరిగీసుకుని ఉన్నట్టు వారి వ్యవహారశైలి కనిపిస్తుంది.
చంద్రబాబు తన రాజకీయ మనుగడకోసం మాటలు మార్చడం అనేది నిత్యం చేసే పనే . అయితే చంద్రబాబుతో సావాసం చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఆయన బాటలోనే మొదటినుండి నడుస్తునట్టు కనిపిస్తుంది. రాజధాని విషయంలో , బీజేపీ విషయంలో, చంద్రబాబు పాలన విషయంలో ఇప్పటికే మాటలు మార్చిన పవన్ కళ్యాణ్ తాజాగా వాలంటీర్లపై చేసిన వాఖ్యలపై కూడా మాట మార్చి తనది కూడా చంద్రబాబు మాదిరి నరం లేని నాలుకే అని నిరూపించుకున్నారు.
గతంలో వాలంటీర్లపై ఆ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు ఇంకా ఎవరు మర్చిపోయి ఉండరు. వాలంటీర్లు ప్రతి ఇంటికి తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలని టార్గెట్ చేస్తూ వారి సమాచారాని సంఘవిద్రోహ శక్తులకి ఇవ్వడం కారణంగానే రాష్ట్రంలో మహిళల అదృశ్య ఘటనలు జరుగుతున్నాయని. హిట్లర్ నిఘా వ్యవస్థ లాగా జగన్ వాలంటీర్ వ్యవస్థ ఉందని. వలంటీర్ వ్యవస్థను కోర్టులో చాలెంజ్చేస్తానని. వారు లేకపోతే దేశం ఆగిపోయిందా. రాష్ట్రంలో పంపిణీ కార్యక్రమం ఆగిపోయిందా, వాలంటీర్ వ్యవస్థ దండు పాళ్యం ముఠాలా తయారై ప్రజల ప్రాణాలు తీస్తోందని అంటూ తీవ్రంగా వాలంటీర్లపై విరుచుకుపడ్డారు.
పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వాఖ్యలతో రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగింది. ప్రతి గడప తిరుగుతూ పధకాలు అందించడంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిన ఈ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలని సామాన్య ప్రజలు సైతం తప్పు పట్టారు. టీవీ డిబేట్లలో కూడా జనసేన పార్టీ నాయకులని రాజకీయ విశ్లేషకులు తప్పుపట్టారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై మాట మార్చేశారు. వాలంటీర్ వ్యవస్థ గురించి తాను ఎప్పుడు చెడ్డగా మాట్లాడలేదని, ఆ వ్యవస్థపై తనకి కోపం లేదని, వాలంటీర్లకు అండగా తాను ఉంటానని చెప్పడంతో అక్కడ ఉన్న వారు అంత ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
పవన్ కళ్యాణ్ మాటలు మార్చడంలో , చంద్రబాబునే మించిపోయాడని ఎన్నికల్లో ఓట్లకోసం ఎన్ని మాటలైన చెప్పే జాబితాలో పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయాడని. సోషల్ మీడియా ఇంత ప్రభావంగా ఉన్న రోజుల్లో ఇలా వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకుని మాట్లాడటం చంద్రబాబు శిష్యరికంలో అబ్బిన విద్య అంటూ ఆ పార్టీ నేతలే మాట్లాడుకోవడం విశేషం ..