‘ఈ జీవితం పిఠాపురం ప్రజలకే అంకితం. ఇల్లు కట్టుకుంటా. ఇక్కడే ఉంటా. మీ సేవలో తరిస్తా’ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటలివి. కానీ జరుగుతున్న పరిణామాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పూర్తిస్థాయిలో ప్రచారం చేయడానికి కూడా సేనాని ఇష్టపడడం లేదు. అన్న నాగబాబుకు బాధ్యతలు అప్పగించేసి తను మాత్రం అడపాదడపా చంద్రబాబుతో సాయంత్రం వేళల్లో ఎన్నికల సభల్లో పాల్గొంటూ హైదరాబాద్కు వెళ్లిపోతున్నాడు.
పిఠాపురం ప్రజల వెంట ఉంటానని చెప్పిన పవన్.. ఇప్పుడు సక్రమంగా కనిపించడం లేదు. నాగబాబే అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు. కొద్దిరోజులుగా చూస్తే గొల్లప్రోలులో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, దళితులతో, చేనేతలతో, మత్స్యకారులతో ఆత్మీయ సమావేశాలు, జనసేన, తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం తదితర కార్యక్రమాల్లో నాగబాబే పాల్గొన్నారు. సేనాని నేరుగా తిరిగి సమస్యలు తెలుసుకుని భరోసా ఇవ్వకండా ఏదో రెండు, మూడు రోజులుండి ఊగి వెళ్లిపోయాడు.
పవన్కు అరవడం తప్ప సబ్జెక్టుపై అవగాహన లేదు. ఇది నిజం. అందువల్ల తాను స్టార్ క్యాంపెయినర్నని చెబూతూ పిఠాపురం ప్రజల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఒకవేళ అక్కడ సమావేశాలు పెడితే సమస్యలు రాసుకోవాలి. వాటిపై చర్చించాలి. డేటా తెప్పించుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పాలి. కానీ అంత ఓపిక పవన్కు లేదు. సాయంత్రం వేళల్లో వారాహి ఎక్కి ఊగిపోమని చెబితే మాత్రం రెచ్చిపోతాడు. ఎందుకొచ్చిన పాట్లని మొత్తం నాగబాబుకు అప్పజెప్పేశాడు. ఈయన జబర్దస్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు.
పిఠాపురం ప్రజలకు ఇచ్చిన మాటను ఎన్నికలకు ముందే పవన్ తప్పాడు. నామినేషన్ వేయకముందే బాధ్యతలను అన్నకు అప్పజెప్పేశాడు. ఒకవేళ ప్రజల టైం బాగోలేక గెలిస్తే హీరోయిన్లతో సాంగ్స్ షూట్ చేసుకుంటూ పిఠాపురాన్ని పూర్తిగా మార్చిపోతాడనే అభిప్రాయం జనసేన కార్యకర్తల్లో ఉంది. టీడీపీ ఇన్చార్జి వర్మ కూడా ఇదే కోరుకుంటున్నాడు. సేనాని ప్రజల్ని పట్టించుకోడు. గెలిచినా, ఓడినా ఇక్కడ ఉండడు. మళ్లీ నాకే అవకాశం వస్తుందని ఆనందపడిపోతున్నాడు.
– వీకే..