పవన్ కల్యాణ్ నేడు కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడా? వాయిదాకు వెళ్తాడా లేదా? ఈ కేసు ఎప్పటికి తేలనుంది? పవన్ కోర్టుకు వెళ్లడం ఏమిటి? కేసు ఏమిటి అనుకుంటున్నారా?
2018 లో మా అమ్మని తిట్టించారు అని పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి గుర్తుందా? హా ఆ సమయంలో టీవీ9 రవి ప్రకాష్ మీద ఏబీఎన్ రాధా కృష్ణ మీద ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 23 తారీఖు వరకు వరుసగా ట్వీట్ లు వేశాడు గుర్తుందా? హా… ఆ ట్వీట్ లు మీదే ఏబీఎన్ రాధా కృష్ణ కోర్ట్ కు వెళ్ళాడు, తన పరువుకు భంగం వాటిల్లింది అనీ, అందుకు గానూ 10 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని కోర్ట్ వారిని ఆశ్రయించగా అప్పటి నుండి ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పటికే 40 వాయిదాలు పూర్తి కాగా ఇవాళ అనగా మార్చ్ 14,2024 నాడు మరో వాయిదా ఉంది.. ఈ 40 వాయిదాల్లో పవన్ ఎన్ని సార్లు కోర్టుకు వచ్చాడో తెలియదు. అసలు కేసు ఎంత వరకు వచ్చిందో కూడా తెలియదు, రాష్ట్రం లో ఎవరి మీదా ఏ పిటి కేసున్నా దాని పుట్టుపూర్వోత్తరాలు వివరిస్తూ కోర్ట్ లోపల కూర్చున విన్న వాడిలా రాసుకొచ్చే రాధా కృష్ణ, తను సొంతగా వేసిన కేసు గురించి ఏ మూలనా అచ్చు వేయకపోవడం, కనీసం స్క్రోలింగ్ లో కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
అయితే 2018 లో వేసిన కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఈ మధ్యలో పవన్ బాబులు ఒక్కటయ్యారు, బాబు కోసం గతంలో లేనంత విధంగా బానిసత్వం చేస్తున్నాడు, బాబు గెలుపే తన జీవిత లక్ష్యం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అలాంటప్పుడు బాబుకి బంధువు అయితే రాధాకృష్ణకు ఆత్మబంధువు అవ్వాల్సిందే, అలాంటిది కేసు ఉపసంహరించుకోకుండా ప్రతీ వాయిదాకు లాయర్ ను పెట్టి మరీ వాదింపజేయడానికి కారణం ఏమై ఉండొచ్చు? పీకే ను ఆర్కే నమ్మడం లేదేమో, ఈ కేసును ఇలాగే సాగదీసి భవిష్యత్తు లో మళ్లీ ఎప్పుడైనా పీకే తోక జాడిస్తే ఈ కేసు అనే కర్రతో కొడదాం అని భావిస్తున్నాడు ఏమో తెలియాల్సి ఉంది. ఏమైనా పీకే ను ఆర్కే వెంటాడుతూనే ఉంటాడు అదైతే పక్కా..