ఏపీలో ఎన్నికలు ముగిసాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ సగటు నమోదైంది. కాగా ఈ ఎన్నికల్లో సీఎం జగన్ ఒంటరిగా బరిలోకి దిగగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ పడ్డాయి. కాగా పలువురు ప్రముఖులు ముఖ్య నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా తన భార్యను పోలింగ్ బూత్ లోకి తీసుకెళ్ళి భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ, ఓటింగ్ సరళిని చూపించారు.
పవన్ కళ్యాణ్ తాను ఓటు వేసినట్లు సిరా గుర్తు ఉన్న వేలును చూపుతూ అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. కాగా ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారి తీసింది. గతంలో పవన్ కళ్యాణ్ తన తల్లిని లోకేష్ తిట్టించాడని, టీడీపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో దూషిస్తున్నారని మండి పడ్డారు. కానీ తన తల్లిని తిట్టించాడని ఆరోపణలు చేసిన లోకేష్ కే పవన్ కళ్యాణ్ ఓటు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల కోసం తల్లిని దూషించిన వారికి ఓటు వేసిన వ్యక్తిగా పవన్ చరిత్రలో నిలిచిపోతాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.