జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు అది. పొత్తులో భాగంగా ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా అని మొదటి నుండి ఉన్న ప్రశ్న… జరుగుతున్న ఈ వింత వింత సంఘటనల వల్ల ఆ ప్రశ్న కు సమాధానం రోజు రోజుకూ క్లిష్టతరం అవుతూ వస్తుంది. పొత్తు ధర్మం పై పవన్ కు ఉన్న చిత్తశుద్ధి పొత్తులో భాగంగా మేజర్ వాటా సీట్లు పొందిన టీడీపీ కి ఏ మాత్రం లేదు. పొత్తు ధర్మానికి ఆద్యంతం టీడీపీ తూట్లు పొడుస్తున్నా పవన్ మాత్రం పొత్తు ధర్మం పాటించాల్సిందేనని తన అభిమానులకు హితవు పలుకుతూ ఉన్నాడు.
తాజాగా మరోసారి పొత్తులో భాగంగా టీడీపీ బీజేపీ అభ్యర్థుల గెలుపుకు జనసేన శ్రేణులు కృషి చేయాలని పిలిపునిచ్చాడు పవన్. కానీ ఎందుకు? బాబు కి లేని ధర్మ నిబద్ధత తనకు మాత్రమే ఎందుకు? బీజేపీ తో ఎలా అయినా పొత్తు కుదర్చాలని పవన్ ను నానా కష్టాలు పెట్టి, చివరికి బీజేపీ తో చీవాట్లు కూడా తిని ( ఆ విషయం పవనే స్వయంగా చెప్పాడు) బీజేపీ వారిని పొత్తుకు ఒప్పిస్తే చంద్రబాబు అనూహ్యంగా ఎన్నికల ముందే ప్లేట్ ఫిరాయించి, ముస్లిం ఓట్ల కోసం బీజేపీ వారే పొత్తు అని తన దగ్గరికి వచ్చారని నేనేం వెళ్లలేదని పట్టపగలు కళ్ళు మూసుకుని అబద్ధం ఆడేశాడు. అలా ఉంటుంది బాబు పొత్తు ధర్మం. ఇక పోతే అభ్యర్థుల గెలుపు కోసం సహకరించడం విషయానికి వస్తే మిగతా వాళ్ల గెలుపు గురించి తర్వాత, స్వయానా పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం లోనే టీడీపీ చేసిన యాగీ అందరూ చూసారు, నామ్ కే వాస్తే పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మను పిలిచి మాట్లాడినా ఆ తర్వాత కూడా వర్మ ఏం తగ్గినట్లు కనపడలేదు. అక్కడ పవన్ గెలుపు కోసం వర్మ సంపూర్ణ మద్దతు ఇస్తాడు అనే నమ్మకం జనసేన శ్రేణులకే లేదు.
ఇక పోతే ముందు 24 అని, దానిలో మూడు లాగేసుకుని, 21 అయినా మిగిలాయి లే అని కాస్త కుదుట పడే లోగా ఇంకో మూడు గుంజేసుకున్నారు. ఆ మిగిలిన 18 చోట్ల అయినా టీడీపీ వారు జనసేన గెలుపుకు సహకారం అందిస్తారా అంటే? ఒక్క చోట కూడా అలాంటి పరిస్థితి లేనే లేదు.. పాపం పవన్ కల్యాణ్ కు కేవలం జగన్ మీద ఉన్న ద్వేషం వల్ల ఎన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది, ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుంది. అందుకే పెద్దలు కడుపు మంట క్యాన్సర్ కన్నా ప్రమాదకారి అనేది..