సాధారణంగా ఎవరికైనా ఒక దెబ్బ తగిలితే అయ్యో పాపం అంటాం.. మనకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఏదైనా ప్రమాదానికి గురయ్యారు అంటే ఆరాలు తీసి మరీ యోగక్షేమాలు కనుక్కుంటాం. దానికి బంధువులే కానవసరం లేదు తెలిసిన వాళ్ళే కానవసరం లేదు సాటి మనిషి అయితే చాలు.. సాటి మనుషుల మీద కనీసం మానవత్వం ఉంటే చాలు. అసలు కనీసం విచక్షణ లేని వ్యక్తిత్వాలు సమాజానికి ఏం సందేశాన్ని ఇస్తాయి.. రాజకీయాల కోసం మనుషులం అనే సంగతి కూడా మర్చిపోయి ఇంత దిగజారి పోవాలా?
విషయానికి వస్తే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ గారి పై విజయవాడ పరిసర ప్రాంతాల్లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాడిలో ఆయన చిన్నపాటి గాయానికి గురై రెండు కుట్లు కూడా పడినటువంటి విషయం విధితమే. అయితే హుందాగా రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా స్పందిస్తారు ఏ విధంగా తమ స్పందన తెలియజేస్తారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పై దాడి జరిగినప్పుడు, ప్రమాదానికి గురైనప్పుడు, దెబ్బ తగిలినప్పుడు ఏ పార్టీ నాయకులైనా సరే రాజకీయాలకతీతంగా చాలా హుందాగా తమ భావాన్ని వ్యక్త పరుస్తారు కనీస సానుభూతిని తెలియజేస్తారు.
కానీ పవన్ కళ్యాణ్ అందుకు పూర్తి విరుద్ధంగా తన అక్కను వెళ్లగక్కాడు. సీఎం జగన్ పై తనకున్న అసూయాద్వేషాలను బయటపెట్టాడు. చిన్న గులకరాయ తగిలితేనే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోవాలా అంటూ తన సంకుచిత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. జరిగిన ప్రమాదంలో చిన్న దెబ్బతో బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది అది తగలరాని చోట మరింత బలమైన గాయం అయితే పరిస్థితి చేయి దాటిపోయి ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఇదేవిధంగా మాట్లాడేవాడా? గాయపడిన జగన్ స్థానం లో పవన్ కళ్యాణ్ ఉంటే ఇంతే బాధ్యతారహితంగా వ్యవహరించే వాడా? రాజకీయాల కోసం మరీ ఇంత దిగజారి ప్రవర్తించాలా? ఏది ఏమైనా ప్రమాదానికి గురైన జగన్ విషయంలో పవన్ కళ్యాణ్ వైఖరి రాజకీయ విశ్లేషకుల నుండి మాత్రమే కాకుండా సామాన్య జనం నుండి ముఖ్యంగా తన సొంత పార్టీ నేతలు నుండే విమర్శలకు దారి తీస్తుంది.