ఒకరి సొంత ఎన్నికల అఫిడవిట్ చూస్తే .. చాలా విషయాలను పట్టి చూపుతోంది .
చదువు : ఇంటర్లో ఎంపీసీ, MEC , ఇంకా ఏవేవో అని చెప్పుకున్నారు, ఐఏఎస్, ఐపిఎస్ చెయ్యకపోవటానికి కారణం అవినీతి రాజకీయ నాయకులకు సెల్యూట్ చెయ్యటం ఇష్టం లేకనే కానీ సామర్థ్యం లేక కాదు అని తల్లితో చెప్పానంటే …. అక్కడ చప్పట్లు , విజిల్స్ , అరుపులు.
వాస్తవములో చదివింది : 10th క్లాస్
సంపాదన: కార్ EMI లు కట్టలేకపోతున్నా – అదే చప్పట్లు , విజిల్స్ , అరుపులుచప్పట్లు, రోజుకు రెండు కోట్లు సంపాదిస్తా అయినా త్యాగం చేసి మీ సేవకోసం వచ్చా – మళ్ళీ అదే చప్పట్లు , విజిల్స్ , అరుపులు, చప్పట్లు
వాస్తవం:
EMI కట్టలేనోడు జూబ్లీహిల్స్ లో గత ఐదేళ్లలో రెండు ఖరీదైన ఆస్తులు కొనటం, గొప్పగా చెప్పుకున్నట్లు రోజుకు 2 కోట్లు సంపాదించేవాని ఆదాయం ఆ తీరులో లేదని సినీ రంగం వరకూ చూస్తే అందరి హీరోల్లానే తన సంపాదన , ఇంకా చెప్పాలంటే తక్కువ సంపాదన.
2024 ఎన్నికలలో TDP తో అవమానకర పొత్తుపై తీవ్ర విమర్శలొస్తే .. పిల్లల కోసం కూడబెట్టిన డబ్బును పార్టీ ఖర్చులకోసం త్యాగం చేస్తున్న అనే డైవర్సన్ తెలివితేటలు ప్రదర్శించటం . ప్రజలకోసం తన 25 ఏళ్ల జీవితాన్ని ధారపోస్తా –
మళ్ళీ అదే చప్పట్లు , విజిల్స్ , అరుపులు, చప్పట్లు.
వాస్తవం :
వివిధ నిర్మాణ సంస్థలనుండి 46 కోట్ల రూపాయలను అప్పు / అడ్వాన్స్ గా చూపెట్టడం. 2024 ఎన్నికల తరువాత వాళ్లందరికీ సినిమాలు చేసిపెడతానని చెప్పటం.
అమరావతి కొందరి కోసం నిర్మించుకుంటున్న ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అనే విమర్శ —
అదే చప్పట్లు , విజిల్స్ , అరుపులు, చప్పట్లు
వాస్తవం:
అమరావతి ప్రాంతములో ఆస్తులు కూడబెట్టడం.
ఇవన్నీ పరిశీలిస్తే కొందరు బాబాలు తమ భక్తులను ఎలాంటి చేష్టలతో బురిడీ కొట్టించి వాళ్ళను ఒక హిస్టీరిక్ బాధితులుగా చేసి వెలిగి పోతుంటారో అదే పద్ధతిని ఈయన రాజకీయాల్లో కూడా మొదలు పెట్టారు.
ప్రజారాజ్యం అంతర్ధానమైన తరువాత … కొన్ని ఏళ్లకు ఉన్నట్టుండి మెరుపుల్లేని ఉరుములా తాను ప్రజాసేవకై ఒక రాజకీయపార్టీని పెడుతున్నా అని చెప్పి రామోజీని కలసి, మోడీని కలసి బాబును కలవటం మనకు బయటకు తెలిసిన విషయమైతే .. అసలు మొదట మాట కలిపింది బాబుతో అని , ఆయన అవసరాలమేరకు ఈయన అవసరాలు తీర్చేవిధంగా కథ మొదలు పెట్టారని తరువాత జరిగిన పరిణామాల క్రమాన్ని బట్టి అర్థమౌతుంది.
పార్టీ పెడతారు.. 2014 కి టీడీపీ కి మద్దతిస్తారు , వాళ్ళ వాగ్దానాల అమలుకు నాది హామీ అంటారు కానీ తమ పార్టీ ఎక్కడా పోటీ చెయ్యరు.
2014 – 2018 వరకూ — ఓటుకు నోటు కేసు సరైన ఆధారాలు లేకుండా ఏమీ మాట్లాడలేము.
విశాఖలో ప్రత్యేక హోదాకై ఆందోళనకు పిలుపు .. ఇతర పార్టీలు కూడా కలిసివస్తే .. మొహం చాటేయటం.
మానిఫెస్టోలో చెప్పిన విధంగా కాపు రిజర్వేషన్ అమలుపరచమని ముద్రగడ పోరాటాన్ని తీవ్రమైన అవమానకరమైన పద్ధతుల్లో అణిచివేస్తే , ఎక్కడ తీవ్రమైన ఆందోళనలతో రాజకీయం టీడీపీ పట్టు జారుతుందోనని ముద్రగడకు చిరంజీవి, దాసరి , ఇతర కాపు వ్యక్తులమాదిరి మద్ధతు తెలుపకపోవటం అటుంచి, ముద్రగడ డిమాండ్ చేస్తున్నది మానిఫెస్టోలో చెప్పిందే కదా, మేనిఫెస్టో అంశాలకు తానూ పూచీగా ఉంటానని ప్రజలకు చెప్పానని అని అడగటం మాని కేరళ తన సినిమా షూటింగ్నుండి వచ్చి బాబును కలిసి తన మద్ధతు బాబుకే అని పరోక్ష సంకేతాలివ్వటం.
ఎన్నికలకు ముందు టీడీపీతో విభేదిస్తున్నాని చెప్పటం, టీడీపీ వ్యతిరేకిస్తున్న బీజేపీని తానూ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పటం , తీరా ఎన్నికలలో తన పార్టీ బి ఫార్మ్ లను టీడీపీ కి ఉపయాగపడేవిధంగా కొన్ని చోట్ల టీడీపీ చెప్పిన వారికివ్వటం.
2019 ఎన్నికల ఓటమి తరువాత బాబు భవిష్యత్ అవసరాలకోసం, బాబు కోరిక/ ఆదేశాల మేరకు బీజేపీ పిలవకపోయినా వారితో కలవటం కానీ జరిగిన ఉప ఎన్నికలలో కానీ బీజేపీ జరిపిన ఆందోళనలలో కానీ గట్టిగా సహకరించకపోవటం.
2024 ఎన్నికలకు ముందు తన పిచ్చి, అమాయక అభిమానులకు మీరు గట్టిగ పోరాడండి ఎన్నికల పోటీ వ్యూహాన్ని నాకు వదిలేయండి అని చెప్పటం కానీ తెర వెనుక చేసింది మాత్రం టీడీపీ కోరిక, అవసరాల మేరకు బీజేపీ పొత్తు వుండే విధంగా వారితో తిట్లు తిని , కస్టపడి బ్రోకరిజం చేశానని తానే చెప్పుకోవటం.
సీఎం సీఎం అని అరవండి అని చెబితే ఆ అమాయక పిచ్చి అభిమానులు రెచ్చి పోయి గొంతులు బొంగురు పోయే విధంగా అరవటం తానేమో టీడీపీ మరికొన్ని కాలాలపాటు బతికి బట్టకట్టి, వీరికెటువంటి ఇబ్బంది లేకుండా వెలిగిపోయేలా గాయత్రీ మంత్రం మాదిరి 24 సీట్లు అని పిచ్చి లాజిక్ ఒకటి తీసి 21 కి సరిపెట్టుకోవడం.
ఇలాంటి ఎన్నో మజిలీలు చివరికి చెప్పేదేమంటే ఇతను టీడీపీ కోసం, టీడీపీ వలన తయారై , టీడీపీ చేత నడపబడుతూ , టీడీపీకోసం అంతర్ధానమయ్యే రాజకీయనాయకుడు గా తన అఫిడవిట్ తో తానే చెప్పుకోవటం..
మరి ఇంత ఘనమైన నాయకుడికి ఆభిమానులెలా ఉంటారని ఆశ్చర్యం అవసరం లేదు , నిత్యానంద ఒక ఫేక్ బాబా అని ఇక్కడ ప్రజలచేత ఛీకొట్టించుకుంటే .. తాను కైలాస దేశం నెలకొల్పితే అక్కడకూ పోయిన వీర భక్తులమాదిరే కొందరు ఈ ఫేక్ నట-రాజకీయనాయకుడి మాయ నుండి బయటపడలేరు. వారినలా సంభ్రమాశ్చర్యాలతో చూడటమే తప్ప మార్పు ను వూహించకూడదు.