జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సూర్యభగవానుడు పగ పట్టాడని ఆయన అభిమానులు గుసగుసలాడుకుంటూ ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికల సమయంలో ఇలాగే చేశాడని గర్తు చేసుకుంటున్నారు. అందువల్లే ఈసారి ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి సేనాని వడదెబ్బకు గురవుతున్నాడని భావిస్తున్నారు. సూర్యదేవుడి ఆశీస్సులు తమ అధినేతకు ఉండేలా పూజలు చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. కానీ కథ వేరే ఉంది.
ఆదివారం నాటి కొత్తపలుకులో ఆంధ్రజ్యోతి అలియాస్ చంద్రజ్యోతి ఓనరైన రాధాకృష్ణ ‘చంద్రబాబు మండుటెండలను సైతం లెక్క చేయకుండా, ముఖంలో అలసట కనిపించనీయకుండా రోజుకు మూడుచోట్ల సభలు నిర్వహిస్తున్నారు. యువకుడినైన తనకు ముసలోడితో పోటీ ఏంటని ఎద్దేవా చేసే సీఎం జగన్ మాత్రం రోజుకు ఒక మీటింగ్తో సరిపెడుతున్నారు. అది కూడా సాయంత్రం పూట ఎండ వేడి తగ్గాక బయటకు వస్తున్నారు’ అంటూ రాసుకొచ్చారు. కానీ అనాల్సింది పవన్ను.
వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఉదయమే మొదలుపెడుతున్నారు. దారి మధ్యలో వివిధ వర్గాల ప్రజల్ని కలుస్తున్నారు. మధ్యాహ్నం సమయంలోనే బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కానీ చంద్రబాబుతో పోల్చి ఆర్కే తనకు తోచింది రాసుకొచ్చారు. ఆయన పలుకులు పేలాల్సింది కూటమిలోని పవన్పైన. ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటికి సేనానికి నాలుగైదు సార్లు వడదెబ్బ కొట్టిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఇటీవల తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో అర్ధాంతరంగా ప్రచారం ఆపేశారు. 3వ తేదీన తెనాలిలో జరగాల్సిన సభను వాయిదా వేశారు. ఇందుకు అనారోగ్య కారణాలను చూపారు. ఆదివారం అనకాపల్లిలో పవన్ వారాహి యాత్ర నిర్వహించారు. ఈ సమయంలో ఆయనకు వడదెబ్బ తగిలిందని, విశాఖ ఎయిర్పోర్టుకు వెళ్తుండగా కారులో సొమ్మసిల్లి పడిపోయాడని, తేరుకున్నాక హైదరాబాద్కు పయనమైనట్లు సాక్షాత్తు ఎల్లో గ్యాంగ్కు చెందిన పేజీలు, పలు మీడియా సంస్థలు రాసుకొచ్చాయి.
ఇప్పుడు రాధాకృష్ణ సేనానిని కోట్ చేస్తూ ఇలా రాయాలని ప్రజానీకం కోరుతోంది. కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు మండుటెండల్లో చంద్రబాబు కష్టపడుతుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం రెండు, మూడురోజులకోసారి వడదెబ్బ అంటూ ప్రచారం చేయకుండా తప్పించుకుంటున్నాడు. అతనికి రాజకీయాలపై సీరియస్నెస్ లేదు. సినిమాల్లో కష్టపడకుండా నటిస్తుంటాడు. నడిచే సీన్లు, చిన్నచిన్న డ్యాన్స్ స్టెప్స్, హీరోయిన్లతో రొమాన్స్ ఇలాంటి సింపుల్గా ఉండేవి మాత్రమే చేస్తాడు. ఫైట్స్ అయితే డూప్ను పంపుతాడు. కష్టం తెలియని వ్యక్తి కాబట్టే కాసేపు ఎండలో తిరగ్గానే సొమ్మసిల్లుతున్నాడు. కూటమి గెలిస్తే అది చంద్రబాబు వల్లే. బహుశా జనసేనతో అవసరం లేని నాడు కొత్తపలుకులో ఇలాంటి మాటలే రావొచ్చు.
అసలు పవన్ సింపతీ డ్రామా ఈనాటిది కాదు. 2019 సమయంలోనూ ఇంతే. సినిమా స్టిల్స్ ఇస్తూ కాలం గడిపాడు. పోలింగ్కు ముందు సెలైన్ పెట్టించుకున్న ఫొటోలు వదిలి తన అభిమానుల్ని గొర్రెల్ని చేశాడు. ఇప్పుడు అదే జరుగుతోందని అనేకమంది భావిస్తున్నారు. టికెట్ల విషయంలో డైవర్షన్ కోసమే నాటకాలు ఆడుతున్నాడని అనేవారు లేకపోకలేదు. మరోవైపు పిఠాపురంలో గెలుపు కోసం డబ్బు కావాలి కాబట్టి హైదరాబాద్కు వెళ్లేందుకు వడదెబ్బను సాకుగా చూపిస్తున్నాడని తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు. సో జనసైనికులూ.. మీ నాయకుడిపై సూర్యభగవానుడికి ఎలాంటి పగ లేదు. మీరు ఆయన్ను తిట్టొద్దు. ఇవన్నీ చీప్ ట్రిక్స్ అంతే..