2014 లో తాను పార్టీ పెట్టినప్పుడు నాది జాతీయ స్థాయి ఆలోచన అనీ, జాతీయ నాయకుడిని అవ్వాలన్న పెద్ద కోరికను బయల్పరిచాడు. పలు సందర్భాల్లో కూడా ఇదే తరహా వ్యాఖ్యానాలు కూడా చేస్తుండేవాడు.. ప్రాంతీయ మరవని జాతీయ వాదం తన సిద్ధాంతం అని కూడా ప్రకటించాడు.. తనని తాను అంత స్థాయిలో ఊహించుకున్న పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు బీఎస్పీ, కమ్యూనిస్ట్ లతో పెట్టుకుని బొక్క బోర్లా పడ్డాడు. పార్టీ అధ్యక్షుడిగా ఉండి, అంత సినిమా క్రేజ్ ఉంచుకుని పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు…
దాని తర్వాత మళ్లీ చేసిన తప్పే చేస్తూ బాబు కోసమే తపన పడుతూ బిజెపి తో టీడీపీ కి పొత్తు కోసం ఒప్పుంచి, చివరికి తను 21 సీట్లకే ఒప్పుకున్నాడు.. ఆ 21 లో కూడా 10 కి పైగా స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులే చోటు దక్కించుకున్నారు అనుకోండి అది వేరే విషయం. అయితే తను జాతీయ నాయకుణ్ణి అని, మోడీ షా లతో పరిచయాలు ఉన్నాయని, కేంద్ర ఇంటిలేజెన్స్ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది అని కేఏ పాల్ తరహాలో స్పీచ్ లు దంచిన పవన్ కల్యాణ్ నేడు ఎంత దయనీయ స్థాయికి చేరుకున్నాడు అంటే, పిఠాపురం నుండి తాను పోటీ చేయబోతున్నానని అనౌన్స్ చేశాకా అక్కడి టీడీపీ అభ్యర్థిని ఒప్పించడానికి నానా తిప్పలు పడ్డాడు, స్వయంగా వర్మ ఇంటికి వెళ్లి తనకు సహకరించమని బ్రతిమాలుకుతున్నాడు. ఇక బహిరంగ సభలలో దయచేసి నన్ను గెలిపించండి అని, నేను అడగడం లేదు అర్ధిస్తున్న అని దీనంగా అడుక్కునే స్థాయికి దిగజారిపోయాడు. సీఎం సీఎం అని పిలిపించుకునే స్థాయి నుండి ఎమ్మెల్యే గా గెలిపిస్తే చాలు అని బాధాతప్త హృదయంతో బామాలుకునే స్థాయికి వచ్చాడు. తనకన్నా చిన్న వాడైన మిధున్ రెడ్డి తన ఓటమి కోసం కృషి చేస్తున్నాడని, నియోజకవర్గం మొత్తం వైసీపీ నాయకులు దిగారని, నన్నొక్కణ్ణి ఓడుంచడానికి ఎందుకు అంత కక్ష కట్టారని సింపతి డైలాగ్ లు కొడుతున్నాడు. తనను తాను గొప్ప నాయకుడు, ఫాలోయింగ్ ఉన్న వాడిలా ఊహించుకునే పవన్ కు నేడు మిధున్ రెడ్డి భయం పట్టుకుంది. జగన్ తానొక్కడే గెలవాలనుకుంటాడు, స్వార్థ పరుడు, ఎవరు గెలవకూడదు అనుకుంటాడు అని ఏదో అర్థం లేని విమర్శ చేశాడు. రాజకీయాల్లో ప్రత్యర్ధి ఓటమి కోసం ప్రయత్నించడం తప్పనిసరే కదా? అందులో విడ్డూరం ఏముంది? అయినా జగన్ ఓడి