జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేనకు కేటాయించిన 21 సీట్లకు గాను విడతల వారీగా 18 సీట్లు ప్రకటించి చివరకు మిగిలిన సీట్ల పంపకానికి నానా కష్టాలు పడుతున్నారు. చివరకు పొత్తులో భాగంగా రెండు ఎంపీ సీట్లు వస్తే వాటిలో అభ్యర్థులను కూడా పోటీలోకి నిలబట్టే పరిస్తితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేరు.
అవనిగడ్డ అసెంబ్లీ సీటుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు రామకృష్ణకు టికెట్ అని ప్రచారం చేసి తన పేరుతో సర్వే లు చేసి చివరకు టికెట్ ఇచ్చే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎంపీ టికెట్ ఇస్తాము అని హామీ తో పార్టీలోకి జాయిన్ చేసుకున్న బాలశౌరికి పార్టీలో జాయిన్ అయిన తరవాత పవన్ కళ్యాణ్ చుక్కలు చూపిస్తున్నారు. ఒకరోజు మచిలీపట్నం ఎంపీగా పోటీ అని ప్రకటించి , మరొక రోజు కాదు అవనిగడ్డ అసెంబ్లీకి పోటి అంటూ మానసికంగా ఆడుకుంటున్నారు , ఇప్పుడు తనకి టికెట్ వుంటుందా లేదా అసలు జన సేనలోకి అనవసరంగా జాయిన్ అయ్యాను అంటూ సన్నిహితుల దగ్గర భోరున విలపిస్తున్నారు. మద్యలో గ్రీన్ కో కంపెనీ డైరెక్టర్ అవనిగడ్డ అసెంబ్లీ టికెట్ మీద ఖర్చిఫ్ వేశారు అని తెలిసి అటు బాలశౌరి ఇటు రామక్రిష్ణ పవన్ కళ్యాణ్ మీద అసహనంతో రగిలిపోతున్నారు.
ఇంకోవైపు టీడీపీ నాయకుడు మండలి బుద్ధప్రసాద్ కు టికెట్ ఇవ్వాలని లేకుంటే టీడీపీకి అందరము రాజీనామా చేస్తాము అంటూ మండల , గ్రామ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే ప్రకటించారు. వైజాగ్ సౌత్ లో వైసీపీ నుండి టికెట్ హామీతో జాయిన్ చేసుకున్న వంశీ యాదవ్ కి టికెట్ అని ప్రకటించారు. దీనితో లోకల్ జన సేన నాయకులు ముఖ్యంగా పార్టీ కార్పొరేటర్ లు గొడవ గొడవ చేసే సరికి దానిని పెండింగ్ లో పెట్టారు. ముఖ్యంగా జన సేన కార్పొరేటర్ సాధిక్ తో వంశీ కి గొడవలు ముదిరి పాకానపడింది. మరోవైపు టీడీపీ కార్యకర్తలు జనసేనకు సహకరించే పరిస్థితులు లేవు.
పాలకొండ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కు కనీస ఆలోచన కూడా లేనట్టు వుంది. పాలకొండలో నలుగురైదుగురు నాయకులు టికెట్ కోసం పోటి పడుతుండటంతో పవన్ కళ్యాణ్ చేతులు ఎత్తేశారు.
ఇక రేపటి నుండి పిఠాపురంలో ప్రచారం మొదలు పెట్టబోతున్న పవన్ కళ్యాణ్ మిగిలిన ఒక ఎంపీ మూడు ఎమ్మెల్యే స్థానాలకు ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారు వారు ఎప్పుడు ప్రచారాలకు వెళ్తారో తెలియని అయోమయంలో అయా నియోజక వర్గాల పార్టీ కార్యకర్తలు అభిమానులు వున్నారు.