జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి వరుసగా 15 రోజులు తొలివిడత ప్రచారం అని ప్రకటించి రెండవ రోజుకే జ్వరం అని హైదరబాద్ వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే, నిన్న జ్వరం తగ్గింది తెనాలి నుండి కాకుండా ఏప్రిల్ 6 నెల్లిమర్ల నుండి ప్రచారం మొదలు పెడతారు అంటూ లీకులు ఇచ్చి చివరకు ఏప్రిల్ 7 నుండి కేవలం రెండు రోజులు మాత్రమే తన పార్టీ జన సేన అభ్యర్ధుల తరుపున ప్రచారం చెయ్యనున్నారు, తరువాత ఉగాది వేడుకలు పేరుతో విరామం ప్రకటించారు. మళ్ళీ ప్రచారం ఎప్పుడు ఎక్కడ చేస్తారో ఎవరికి తెలియదు.
జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 7న అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ తరుపున , ఏప్రిల్ 8న ఎలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్ తరుపున ప్రచారం చేయనున్నారు . ఇక తెనాలి, నెల్లిమర్ల , విశాఖ సౌత్, పెందుర్తి పర్యటనకు సంబంధిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని మీడియాకు వెల్లడించారు. దీనితో జన సేన అభ్యర్థులు మాకోసం అసలు పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారా లేక అనారోగ్యం పేరుతో తప్పించుకు తిరుగుతారా అని ఆందోళన పడుతున్నారు.
రెండు రోజులు రోజుకొక నియోజకర్గం ప్రచారం, వెంటనే ఓ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారు. అటు నుండి తాను పోటీ చేసే పిఠాపురంలో రెండు రోజులు ప్రచారం కి వెళ్తున్నారు.ఇలా అయితే మా నియోజకవర్గల పరిస్థితి ఏమిటీ, పవన్ కళ్యాణ్ ను నమ్మి ఎలక్షన్ లో దిగితే ఈరోజు నడి సముద్రంలో వదిలేసి పవన్ కళ్యాణ్ తన స్వార్ధం తాను చూసుకుంటున్నారు అని పార్టీ కీలక నేతలకు తమ గోడును వెళ్ళదీసుకుంటున్నరు.
ఇక రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ వరుసగా మూడు రోజులు కూడా ప్రచారం చెయ్యలేకపోతే రేపొద్దున ప్రజలకు అందుబాటులో ఎలా వుంటారు అంటూ పవన్ కళ్యాణ్ ప్రచారా విధానంపై నవ్వుకుంటున్నారు.