పిఠాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చి హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు.. పిఠాపురం లో రెండు రోజులు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ నేడు పాదగయ క్షేత్రం లోని కుకుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవార్లతో పాటు పురు హుతిక శక్తి పీఠం లో పూజలు నిర్వహించారు.. అనంతరం శ్రీపాద వల్లభ క్షేత్రాన్ని దర్శించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని రెండు గంటల్లో ముగించుకుని కుమారపురం గ్రామంలో ఆయన బస చేస్తున్న హోటల్ కు చేరుకున్నారు.. వాస్తవానికి పూజా కార్యక్రమాల అనంతరం ఉప్పాడ, కొత్తపల్లి, గొల్లప్రోలు గ్రామాల్లో పలు గ్రామాల్లో పర్యటించవలసి ఉంది. కానీ పవన్ కు త్రోట్ ఇన్ఫెక్షన్ తో పాటు జ్వరం కూడా వచ్చిందని అందుకే హైదరాబాద్ తిరుగు పయనం అవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలియజేసాయి.
ఇది పవన్ వరస. 2019 ఎన్నికల దెబ్బ, రాష్ట్రవ్యాప్తంగా జగన్ హవా దెబ్బకు కేవలం పిఠాపురం మరియు జనసేన పోటీ చేసే నియోజక వర్గాల ప్రచారానికే తనను పరిమిత చేసుకున్న స్వయంప్రకటిత జాతీయ నేత శ్రీమాన్ పవన్ కల్యాణ్ గారు, ఇచ్చిందే ఏప్రిల్ 12 వరకు షెడ్యూల్. అందులోనూ ఒక్కరోజు పబ్లిక్ మీటింగ్ లో అదీ కూడా రాత్రులు పాల్గుని థ్రోట్ ఇన్ఫెక్షన్ మరియు జ్వరం బారిన పడ్డారట, ఆ మాత్రం జ్వరానికి పిఠాపురం లో వైద్యం అందక హైదరాబాద్ వెళ్తున్నారట. రాజకీయాల్లో పవన్ అంత బద్దకస్తుడు, సోమరిపోతు మరొకరు బహుశా ఉండకపోవచ్చు… ఆశ మాత్రం చాలా పెద్దది ప్రయత్నం మాత్రం ఆవగింజంత. సినిమాల్లో ఏ కష్టం లేకుండా ఫ్రీ క్రేజ్ లభించినది కాబట్టి రాజకీయాల్లో కూడా అలాగే తానేం కష్టం చేయకుండా తన దరికి రావాలనుకుంటాడు పవన్..