మొన్న చంద్రబాబు బహిరంగ సభలో అరకు, మండపేట అభ్యర్థులని ప్రకటించాడని, జనసేన కార్యకర్తల, కాపు సామాజిక వర్గం నుండి వచ్చిన ఒత్తిడి మేరకు నేను కూడా రెండు సీట్లు ప్రకటిస్తా అని పవన్ నిన్న రాజోలు రాజానగరం అభ్యర్థులని ప్రకటించి టిట్ ఫర్ టాట్ అనగా, పొత్తుపై సందేహాలు నెలకొన్నాయి.. తరువాత జరిగిన చర్చల ఫలితంగా మళ్లీ పొత్తు కొత్తగా చిగురించింది అని అందరూ భావించారు.. మరోపక్క ఆంధ్రజ్యోతిలో బీజేపీ తో నేడే పొత్తు ప్రకటన, రేపు పొత్తు ప్రకటన, త్వరలో సీట్ల సర్దుబాటు అంటూ ఊదరగొట్టి జనాలని బలవంతంగా నమ్మించే ప్రయత్నం చేస్తుండగా తాజా గా పవన్ కళ్యాణ్ అనూహ్యంగా భీమిలీ, గాజువాక, పెందుర్తి, యలమంచిలి సీట్లలో టీడీపీ తో సంప్రదింపులు లేకుండా, ఉమ్మడి గా అభ్యర్థులని ప్రకటించకుండా తన సొంతగా అభ్యర్థులని ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి…
ఈ నేపథ్యం లో పొత్తు ఉంటుందా? లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి… ఇక మరోవైపు నేడో రేపో బాబు- పవన్ కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు, బీజేపీ తో పొత్తు ప్రకటన చేయనున్నారు, సీట్ల వ్యవహారం కొలిక్కి వస్తుంది అని ఆంధ్రజ్యోతిలో ప్రచారం చూస్తూ ఉండగా అనూహ్యంగా బీజేపీ అధిష్టానం నుండి కేవలం పవన్ కి మాత్రమే పిలుపు రావడం, వెనువెంటనే పవన్ సొంతగా నాలుగు సీట్లు ప్రకటించడం జరిగిపోయాయి…
ఈ పరిణామాల దృష్ట్యా టీడీపీ జనసేన పొత్తు పోటీ కి ముందే అంతం అయ్యేలా ఉంది.. పొత్తు లేకపోతే ఎన్నికల ప్రచారం లో భాగంగా పవన్ స్టాండ్ ఎలా ఉండబోతుందో? నిన్నటి వరకు బాబు సీఎం అవ్వాలి, జగన్ దిగిపోవాలి అంటూ తిరిగిన తను రేపటి నుండి ఎలా మాట్లాడబోతున్నాడో? వేచిచూడాలి…