“టీడీపీ వాళ్ళు తొందరలో ఒక మాట అన్నా సహనం కోల్పోవద్దు”, “నన్ను సీయం కావాలనో, ప్రాధాన్యత కావాలనో కోరుకోవద్దు” మళ్ళీ పవన్ కళ్యాణే.
రోజుకి ఆరొందలకి పని చేసే కూలీలు కూడా… తమతో పాటు తమ మేస్త్రి కింద పని చేసేవాడిని ఎవరైనా ఏమన్నా అన్నా, లేదా వాళ్ళ మేస్త్రినే అన్నా కయ్య్య్ అని లేస్తారు. ఇలా చేవచచ్చిన జీవాల్లా, మన్ను తిన్న పాముల్లా చలనం లేకుండా ఉండమని, వాళ్ళ నాయకుడే చెప్పినపుడు, ఇంక ఏ కార్యకర్త మాత్రం ఏం చేయగలడు.
ఇదెక్కడి శల్యపరీక్ష? పొత్తు ఉన్నప్పుడు ఎంతోకొంత మన పై చేయి కూడా ఉండాలి కదా?? అంటే అటువైపు పెద్దాయన ఇటువైపు పెద్దాయనని నెత్తిన పెట్టుకుని, కానీ అతని తాలూకా మనుషుల మీద దాష్టీకపు మంత్రాలు చదువుతూ ఉంటే, పోన్లే మనకేమైతేనేమి, మనోడికి పూలమాల వేసారు కదా అని వాళ్ళంతా సరిపెట్టుకోవాలా??
పోనీ టీడీపీ వీళ్ళ నాయకుడికి పూలమాల వేసిందా?? చివరికి చెవిలో పువ్వు పెట్టి పంపకుండా ఉంటే అంతేచాలు అనేంత చరిత్ర టీడీపికుంది. మరి దేనికీ కంటితుడుపు మాటలు?? 2019 ఎన్నికలపుడు కూడా, “జనసేన బీఫార్మ్ నీకు ఇస్తాం, నీకు నచ్చిన వాళ్ళకి టికెట్లిచ్చుకో అన్నారు” అని వల్లభనేని వంశీయే చెప్పాడు. మరింకెందుకీ ముసుగులో గుద్దులాట?? “నా వాటా నాకెప్పుడో వచ్చేసింది, మీరు వెళ్ళి వాళ్ళ జెండాలు మోయండి” అని డైరెక్ట్గా పార్టీ వాళ్ళకి చెప్పుకోవచ్చు కదా. కనీసం వాళ్ళకయినా ఒక క్లారిటీ ఉంటుంది.