ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం నేతలకి సర్వసాధారణం అయిపోయింది. అలా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి నుంచి గెలిచిన కొంతమంది నేతలు టిడిపిలో, టిడిపిలో గెలిచిన నేతలు వైఎస్ఆర్ సీపీలో జాయిన్ అయ్యారు. ఇలా పార్టీ ఫిరాయించే నేతలందరికీ సాధారణంగా పార్టీలు టికెట్లు కేటాయించని పరిస్థితి. పార్టీ మారి వచ్చిన నేతలకు ప్రజాబలం, ధనబలం ఉంటే తప్ప వారికి టికెట్లు కేటాయించని పరిస్థితి. అలా పార్టీ మారిన కొంతమంది నేతలకు 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ దక్కించుకున్నారు వారిని ఒకసారి చూద్దాం.
గన్నవరం అసెంబ్లీ నుంచి టిడిపి తరఫున 2019లో వల్లభనేని వంశీ పోటీ చేసి వైఎస్ఆర్సిపి అభ్యర్థిపై గెలిచారు. టిడిపి తరఫున గెలిచిన వల్లభనేని వంశీ కొన్ని రోజుల తర్వాత టీడీపీకి దూరమైయారు కానీ అధికారికంగా వైసీపీలో చేరలేదు. రాబోయే 2024 ఎన్నికల్లో వంశీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేయనున్నారు.
వాసుపల్లి గణేష్, 2019 ఎన్నికల్లో విశాఖపట్నం దక్షిణ నియోజవర్గం నుంచి టిడిపి తరఫున పోటీ చేసి గెలిచాడు. గెలిచిన తర్వాత వైఎస్ఆర్సిపి లో జాయిన్ అయ్యాడు. 2024 ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ వైఎస్ఆర్సిపి విశాఖపట్నం దక్షిణ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. 2024 ఎన్నికల ముందు వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయ్యాడు. రానున్న ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేయనున్నారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నెల్లూరు రూరల్ శాసన సభ్యుడిగా గెలుపొందాడు. గెలిచిన మూడు సంవత్సరాల తర్వాత టిడిపి పార్టీలో జాయిన్ అయ్యాడు. 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయనున్నారు.
నరసరావుపేట పార్లమెంట్ నుంచి లావు కృష్ణదేవరాయలు 2019లో వైఎస్ఆర్సిపి తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2024 జనవరిలో టిడిపి పార్టీలో జాయిన్ అయ్యారు. రానున్న ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా టిడిపి నుంచి పోటీ చేయనున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2018లో వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సిపి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ తన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి నెల్లూరు సిటీ టికెట్ కేటాయించకపోవడంతో వైఎస్ఆర్సిపి పార్టీని వీడి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. నెల్లూరు పార్లమెంటు నుంచి తెలుగుదేశం తరపున ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
వర ప్రసాద్ రావు వైఎస్ఆర్సిపి తరఫున గూడూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి టికెట్ కేటాయించకపోవడంతో బిజెపి పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన వెంటనే బిజెపి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు.
2019 ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ సీపీ తరుపున పోటీ చేసిన జంగల పల్లి శ్రీనివాసులు ఆ ఎన్నికల్లో గెలిచాడు. 2024 ఎన్నికలకు వైఎస్ఆర్సిపి టికెట్ నిరాకరించడంతో శ్రీనివాసులు జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. శ్రీనివాసులకి జనసేన తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది.