అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ చరిత్ర గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు పరిటాల , గంగుల కుటుంబాల మధ్య జరిగిన వర్గ పోరు గురించి చెప్పకుండా ఉండటం సాధ్యం కాదు. దశాబ్ధాలుగా కొన్ని వందలమంది ఈ ఫ్యాక్షన్ కి బలైపోయారు. వర్గ కక్షలతో గ్రామాలకు గ్రామాలే కాలి బుగ్గైపోయిన ఘటనలు కోకోల్లలని చెప్పవచ్చు. అయితే తెలుగుదేశం సీనియర్ నాయకుడు పరిటాల రవి హత్య అనంతరం తగ్గు ముఖం పట్టిన ఫ్యాక్షన్ హత్యలు దశాబ్దకాలంగా క్రమేపీ కనుమరుగయ్యాయనే చెప్పాలి.
వెంకటాపురం కేంద్రంగా పరిటాల కుటుంబం, మద్దెల చెరువు కేంద్రంగా గంగుల కుటుంబం ఎవరి పరిధిలో వారు రాజకీయాలు చేసుకుంటూ పార్టీలకి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే మాసిపోయిన గాయాలను మళ్ళీ రెచ్చగొట్టి హత్యా రాజకీయాలను ప్రొత్సహించే విధంగా పరిటల సునీత వ్యవహారం ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. దీనికి ఆమె ప్రశాంతంగా ఉన్న మద్దెల చెరువు గ్రామనికి ఎన్నికల ప్రచార నిమిత్తం వెళ్ళి అక్కడ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన తీరు కారణంగా చెప్పొచ్చు.
మద్దెల చెరువు గ్రామానికి పెద్దదిక్కుగా ఉన్న గంగుల సూర్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని అదే గ్రామంలో టీవీ బాంబ్ తో హతమార్చారనే విమర్శలు మూటగట్టుకున్న పరిటాల వర్గం గతంలో ఎన్నడు లేని విధంగా ఇప్పుడు ఎన్నిక ప్రచారం అంటూ అదే గ్రామానికి వెళ్ళి హంగామా చేయడంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే పరిటాల సునీత ఇలాంటి చర్యలు చేపడుతున్నారని మద్దెల చెరువు గ్రామ ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
పరిటాల సునీత ప్రచారంలో రచ్చరచ్చ..
మద్దెలచెరువు లో కాసేపు టెన్షన్ వాతావరణం..
మద్దెలచెరువు గ్రామంలో ప్రచారానికి వెళ్లిన పరిటాల సునీత.. సునీత ప్రచారానికి వెళ్లిన సమయంలో వైసీపీ జెండాలు చూపించిన వైసీపీ కార్యకర్తలు
పోలీసులు ఉన్నా వారిని అడ్డుకోలేదని టీడీపీ కార్యకర్తల ఆరోపణ… pic.twitter.com/uclWZ7XC5Z