ఎన్నికల్లో డబ్బులు, మధ్యం పంచి ఓటర్లను ప్రలోభపెట్టరాదని ఎన్నికల నిభందనల్లో స్పష్టంగా ఉన్నా, గత ఎన్నికల్లో ఆ నిభందనలను టీడీపీ పెద్దగా పట్టించుకోలేదు. 2019లో గెలుపే లక్ష్యంగా యదేచ్చగా డబ్బులు పంచారనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఆ ఆరోపణలను నిజం చేస్తూ పర్చూరు టీడీపీ శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావు రెవెన్యూ ఇంటిలిజన్స్ అధికారులకి దొరికిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గత ఎన్నికల్లో పర్చూరు టీడీపీ శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావుకు సంభందించి నోవా అగ్రిటెక్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ చేసిన అక్రమాలు బయట పడ్దాయి.
గత ఎన్నికల్లో నోవా అగ్రిటెక్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఓటర్లను ప్రభావితం చేసినట్టు నిర్ధారణ అయింది. పావులూరి గ్రామంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు 2 లక్షల 39 వేల నగదు పంపిణీ చేసినట్లు, అలాగే దుద్దుకూరు గ్రామంలో 15 లక్షలు పంచినట్లు నిర్ధారణ అయింది. ఆ డబ్బు పంపిణీకి నోవా అగ్రిటెక్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థకి చెందిన ఉద్యోగులు అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేష్ అనే వ్యక్తులని ఉపయోగించినట్టు అధికారులు గుర్తించారు.
ఈ ప్రలోభాలకి సంభందించి కీలక డైరీనీ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు స్వాదీనం చేసుకుని , తదుపరి విచారణ కోసం బాపట్ల జిల్లా పోలీస్ , ఐటీ, ఈడీ, సెబ్ లకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది.