సత్తెనపల్లి పరిశీలకుడిగా పల్నాడు జిల్లా యువత అధ్యక్షుడు.
ఏపీలో మరో కొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇన్చార్జ్లను నియమిస్తూ దూసుకుపోతున్న అధికార పార్టీ ప్రతిపక్షాల కంటే ముందుగానే ఎన్నికలకు సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే సిద్ధం సభలతో తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ చాటి చెప్తుండగా ప్రతి పక్ష జనసేన బీజేపీ మాత్రం అభ్యర్థులను ప్రకటించడంలో వెనుకబడ్డాయి.
ఈ నేపథ్యంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల అసెంబ్లీ పరిశీలకులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గుంటూరు వెస్ట్ పరిశీలకునిగా రాతంశెట్టి సీతా రామాంజనేయులు, గుంటూరు ఈస్ట్ పరిశీలకునిగా మిట్టపల్లి రమేష్ బాబు, తెనాలి పరిశీలకునిగా మందపాటి శేషగిరిరావు, ప్రత్తిపాడు పరిశీలకునిగా మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియమించింది.
బాపట్ల జిల్లా విషయానికి వస్తే రేపల్లె నియోజకవర్గం పరిశీలకునిగా అడపా శేషగిరిరావు, బాపట్ల పరిశీలకురాలిగా నల్లమోతు రూత్రాణి, వేమూరు నియోజకవర్గ పరిశీలకునిగా శ్యాంప్రసాద్ రెడ్డి, పర్చూరు పరిశీలకునిగా తల్లం సాయి గోపాలకృష్ణను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
పల్నాడు జిల్లాలో నరసరావుపేట పరిశీలకునిగా షేక్ గులాం రసూల్, చిలకలూరిపేట పరిశీలకునిగా చిట్టా విజయభాస్కర్ రెడ్డి, సత్తెనపల్లి పరిశీలకునిగా వైఎస్సార్ పల్నాడు జిల్లా యువత అధ్యక్షుడు పడాల సాంబశివారెడ్డిని, వినుకొండ పరిశీలకునిగా యర్రం వెంకటేశ్వరరెడ్డి, మాచర్లకు దేవేళ్ల రేవతిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. పార్టీ పరిశీలకులుగా నియమితులైన వారు ఆయా నియోజకవర్గాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఆ నియోజకవర్గ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర వహించనున్నారు.