పవన్ కళ్యాణ్ మాటలు కోటలు దాటుతాయి గాని చేతలు గేటులు కూడా దాటవు అనేది ఎప్పటినుండో వినిపిస్తున్న విమర్శ. ఆ విమర్శలకు తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ అడుగులు ఆచరణ కూడా ఉండటం షరా మామూలే. అయితే ఎన్ని విమర్శలు చేసినా ఎంతమంది ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ విధివిధానాలను ఎండగట్టిన ఏమాత్రం ఆలోచన లేకుండా నిస్సిగ్గుగా అదే పంధాలో పయనిస్తాడు పవన్ కళ్యాణ్.
ఉదాహరణకి మా అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కమ్మ మీడియా నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది. చిరంజీవి వ్యక్తిత్వం మీద ఎంతో దారుణమైన అభాండాలు వేసి ఆయన వ్యక్తిత్వ హననానికి పూనుకుంది. ప్రజల కోసం పెట్టిన పార్టీని విమర్శలు పాలు చేసి ‘జెండా పీకేద్దాం’ అంటూ తాటికాయంత అక్షరాలతో హెడ్డింగులు మీద హెడ్డింగులు పెట్టి వెక్కిరించింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో టిక్కెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు అని నీలాపనిందలు మోపింది. మీకు ఎదురుగా ఇంకెవరు పార్టీలు పెట్టకూడదా? ఎందుకు మాపై మీకు ఇంత కక్ష? అంటూ తన అన్న ఆవేదన వ్యక్తం చేశారని గుండెలు బాదుకుని మరీ చెప్పాడు పవన్ కళ్యాణ్.
చిరంజీవి ముఖ్యమంత్రి కావాలంటే… మా కమ్మ రక్తం ఎక్కించుకోవాలని కమ్మ ప్రముఖులు మా అన్నను తీవ్రంగా కించపరిచారు. ఆ తరువాత నేను పార్టీ పెడితే వాడికి 10 – 15 సీట్లు పడేస్తే మన వెనక కుక్కలా పడి ఉంటాడని నన్ను హేయమైన మాటలతో కించపరిచారు. అంతటితో ఆగకుండా నా తల్లిని కూడా అత్యంత జుగుప్సాకరమైన మాటలతో మాటల్లో చెప్పలేని బూతులతో దుర్భాషలాడి దూషించారు. నా వెనుక ఉన్నది అలాగా జనం అని నా జాతిని అవహేళన చేసారని పలు మార్లు చెప్పుకొని ఏడ్చిన పవన్ నేడు అవన్నీ మరిచిపోయి పదేపదే అమ్ముడు పోవడానికి సిద్దపడుతున్నాడని ఇదే జనసేన పార్టీ సిద్ధాంతమని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.