తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, రాజకీయాల్లో మహనీయుడు, ఎన్టీఆర్ మరణం తెలుగు జాతికే కాక యావత్ దేశాన్ని శోకసంద్రం లో ముంచేసింది…
ఇది ఎన్టీఆర్ మరణం తర్వాత నిర్వహించిన సంతాప సభలో చంద్రబాబు పలికిన వాక్యాలు….
ఎన్టీఆర్ ని కూలదోసి, ముఖ్యమంత్రి అయిన బాబు, ఎన్టీఆర్ బతికున్న రోజుల్లో ఎన్టీఆర్ కు నైతిక విలువలు లేవని, అవినీతిపరుడనీ, అసమర్థుడు అని నోటికొచ్చిన మాట మాట్లాడి ఎన్టీఆర్ మరణించగానే భౌతిక కాయం వద్దకు వెళ్లి చెప్పులేయించుకున్న బాబు, ఎన్టీఆర్ పోయిన రెండోరోజే సంతాప సభ పెట్టి, ఎన్టీఆర్ పేదల పెన్నిధి అని, సినిమా రంగంలో కోట్ల రూపాయల ఆదాయం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చి పేదల బతుకులు మార్చాడని, కార్యసాధకుడని, దేశం కార్యకర్తలంతా ఎన్టీఆర్ లా అవినీతి రహితంగా ఉంటూ ఆదర్శంగా నిలవాలని, పిలుపు ఇచ్చాడు…
బతికున్నప్పుడు అవినీతి పరుడు, అసమర్థుడు, నైతిక విలువలే లేవు అన్న బాబు, చనిపోయిన వెంటనే వాటికి పూర్తి వ్యతిరేకంగా ఆయన ఆశయాలు అంటూ మాట్లాడి ఎన్టీఆర్ వర్గం వారిని కూడా తనతో కలవమని కోరడం, చనిపోయినవాడు ఎలాగో పోయాడు మనందరం కలిసి పని చేద్దాం అని ఉన్న నలుగురుని కూడా లాక్కున్న బాబు, చనిపోయాక కూడా ఎన్టీఆర్ ఆత్మను శాంతించకుండా చేశాడు…
ముందు చెప్పినట్లు ఎన్టీఆర్ అవినీతిపరుడా, నైతిక విలువ లేనివాడా? అసమర్థుడా? లేక పోయాక చెప్పిన దైవాంశసంభూత సిద్ధాంతం, నీతివంతుడు, కార్యసాధకుడు లాంటివి నిజమా? రెండిట్లో ఏదో ఒకటి నిజం అయితే రెండోది ఖచ్చితంగా అబద్దమే. మరి సొంత కుటుంబసభ్యుణ్ణి, అందునా పిల్లనిచ్చిన మామని, పదవి ఇచ్చిన నాయకుణ్ణే తన స్వార్థం కోసం పదవీ వ్యామోహంతో అంత నీచ స్థాయిలో చిత్రీకరించి, మానసిక క్షోభకు గురిచేసి చనిపోయేలా చేసిన బాబు ఇక ఇతరుల మీద ఏ స్థాయిలో దిగజారుడు రాజకీయం చేయగలడో ప్రత్యేకంగా చేపేది ఏముంది?
చంపేది ఆయనే, పిండం పెట్టేది ఆయనే, కడాన దండేసి దండం పెట్టేది కూడా ఆయనే…