ఎన్నికలు దగ్గర పడుతుంటే చాలు బాబు కు హఠాత్తుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు గుర్తొస్తాయి, హడావిడిగా శంకుస్థాపనలు చేస్తాడు. ఎన్నికలు అయిపోయాక ఇక వాటి ఊసే ఉండదు. మళ్లీ ఎన్నికలు రావడం మళ్లీ తాజాగా శంకుస్థాపనలు చేయడం బాబుకు షరా మామూలే..
ఇది 1996 లో పార్లమెంట్ ఎన్నికల ముందు వార్త. వెలుగోడు కు, హంద్రీనీవా రాయలసీమ సుజల స్రవంతి పథకానికి, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రెండో దశ పథకానికి, ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ లకు వెంటవెంటనే శంకుస్థాపన చేసి శిలాఫలకాలు ఏర్పాటు చేశాడు. ఆయన గురించి రాష్ట్రం అంతా తెల్సిందేగా ఎన్నికలు అయిపోయాక యథావిధిగా ఆ ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేసిన విషయమే మర్చిపోయాడు. 1996 పార్లమెంట్ ఎన్నికల తర్వాత 7.5 ఏళ్లు అధికారంలో ఉన్నా ఆ ప్రాజెక్ట్ లలో వేటికి తట్ట మట్టి కూడా ఎత్తలేదు, రూపాయి ఖర్చు చేయలేదు. చంద్రబాబు శంకుస్థాపనలు చేసే ప్రాజెక్టు లకు ఆయన ఖర్చు చేసే సొమ్ము కేవలం శంకుస్థాపనలకే తప్ప ప్రాజెక్ట్ లు కట్టడానికి కాదు.. ఒకే ప్రాజెక్ట్ కు పలుమార్లు శంకుస్థాపన చేసిన ఘనత కూడా బాబు సొంతం…