మేనిఫెస్టోలో 98.5% హామీలను అమలు చేసిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్
పదవి కోసం ప్రలోభ దేబిరింపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధం సభ గురించి చైతన్య రథం అనే టీడీపీ పత్రికలో రాసిన మాటలివి. ఓటమిని ఒప్పుకున్న వైఎస్ జగన్, విపక్షంపై విషం, ప్రజాధన దుర్వినియోగం.. అంటూ ముఖ్యమంత్రిపై అక్కసును వెళ్ళగక్కింది..
“ నేను మీ కోసం ఇన్ని సార్లు బటన్ నొక్కాను.. నాకోసం మీరు ఒక్కసారి బటన్ నొక్కండి “ అని వైఎస్ జగన్ అడగడం దేబిరింపు అయితే.. పదవుల కోసం కదిలే బండిలో చంద్రబాబు ఒంగి ఒంగి దండాలు పెట్టడాన్ని ఏమంటారు. వాస్తవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ “ మీ బిడ్డ ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందంటేనే మళ్ళీ నాకు ఓటెయ్యండి..” అంటూ ధైర్యంగా ప్రజలకు చెబుతున్నారు.. కానీ 2014 ఎన్నికలలో అనుకోని పరిస్థితిల్లో పలు పార్టీల పొత్తులో గద్దెనెక్కిన చంద్రబాబు మాత్రం.. ఐదేళ్ళలలో ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చకుండా.. 2019 ఎన్నికల ముందు టీడీపీ పార్టీకి ఓటెయ్యాలంటూ ప్రజల ముందు ఒంగి ఒంగి దండాలు పెట్టారు. ఎన్నికల తరువాత టీడీపీ ఓటమి అనంతరం ఒంగి ఒంగి దండాలు పెట్టినా ప్రజలు నున్ను గెలిపించలేదని ఏడ్చారు.. వీటిని దేబిరింపు అంటారు.
ఇప్పటికి వరకూ మేనిఫెస్టోలో హామీలను 98.5 % పూర్తి చేసిన నాయకులు లేరు.. ప్రజల మధ్యలో నిలబడి.. నన్ను నమ్మితేనే నాకు ఓటెయ్యండన్న ముఖ్యమంత్రి లేరు.. అలాంటిది 2024 ఎన్నికల
ప్రచారానికి 2019 మేనిఫెస్టో ప్రొగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చి ఓట్లు అడుగుతామని చెబుతున్న దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్.. ఆయనకు దేబిరించాల్సిన అవసరమే లేదు..
2014 నుండి 2019 ప్రజలను దొంగ హామీలతో మోసం చేసిన చంద్రబాబు దేబిరించాలి.. రానున్న మూడు నెలల్లో ప్రజలు అది కూడా ప్రత్యక్షంగా చూస్తారు.