ఎన్నికల ముందు బిజెపి కి అనూహ్యంగా సుప్రీం కోర్ట్ రూపం లో ఎదురుదెబ్బ గా ఎలక్టోరల్ బాండ్స్ విషయాన్ని భావించొచ్చు. ఎన్డీయే ప్రభుత్వమే ఎలక్టరల్ బాండ్స్ చట్టాన్ని తీసుకువచ్చి, వాటి ద్వారా దేశం లో అన్ని పార్టీలకన్నా అత్యధిక ఫండింగ్ పొందిన బిజెపి కి నైతికంగా కాస్త ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది…
మాట్లాడే విషయం లో సబ్జెక్ట్ ఉన్నా, ఒక్కోసారి ఆ చెప్పే విషయం లో క్లారిటీ లేక విమర్శలకు గురయ్యే నిర్మలా సీతారామన్ ఈసారి ఎలక్టరల్ బాండ్స్ విషయంలో కాస్త సూటిగా బదులిచ్చారు అని చెప్పొచ్చు. గతంలో రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది అని రిపోర్టర్ లు అడగ్గా, రూపాయి విలువ పడిపోవడం లేదు డాలర్ విలువే పెరుగుతుంది అని సమాధానం ఇచ్చిన నిర్మలా విమర్శలకు గురైంది. నిజానికి అంతర్జాతీయ మార్కెట్ లో ద్రవ్య సంక్షోభం రావడం తో డాలర్ విలువ బాగా పెరుగుతూ పోతుంది, దానితో పోల్చినప్పుడు ఒక్క రూపాయే కాదు అన్ని దేశాల కరెన్సీ విలువలు క్షీణిస్తున్నాయి. కాకపోతే ఆవిడ సమాధానం చెప్పిన తీరు సరిగా లేదు కానీ విషయం అయితే నిజమే…
ఎలక్టోరల్ బాండ్స్ అనేవి అన్ని పార్టీలు నగదుగా మార్చుకుని ఖర్చు చేసుకున్నాయి, ఏ కాంగ్రెస్ అయితే ఇప్పుడు బీజేపీ ని ఎలక్టోరల్ బాండ్స్ మీద యాగీ చూస్తుందో ఆ పార్టీ కూడా ఎలక్టోరల్ బాండ్స్ స్వీకరించింది. కాబట్టి ఏ పార్టీ కి ఎలక్టోరల్ బాండ్స్ మీద మాట్లాడే నైతిక హక్కు లేదనేది స్థూలంగా ఆమె వాదన. ఇందులో నిజమూ లేకపోలేదు. ఎలక్టోరల్ బాండ్స్ అనే చట్టం చేస్తున్నప్పుడు లోక్సభలో కాంగ్రెస్ తీవ్రం గా వ్యతిరేకించింది. ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అని విమర్శించింది, సుప్రీం కోర్ట్ లో దీనికి వ్యతిరేకంగా కేసు వేసిన వారిలో కాంగ్రెస్ వారూ ఉన్నారు. అంతగా వ్యతిరేకించినప్పుడు ఆ చట్టం ద్వారా వచ్చిన నిధులను కాంగ్రెస్ స్వీకరించి ఉండకూడదు కదా? ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అని ఆ బాండ్స్ ని నగదు రూపం లోకి మార్చకుండా ఉండాల్సింది కదా? ఇప్పుడు సుప్రీం కోర్టు ఆ వివరాలు బయటపెట్టమని ఆదేశించడం తో వచ్చిన వివరాలను పట్టుకుని కాంగ్రేస్ విమర్శిస్తుంది, ఒకవేళ కోర్టు వలన బహిర్గత పరచకుండా ఉండి ఉంటే ఇదంతా ఉండేది కాదు కదా అనేది విశ్లేషకుల ప్రశ్న..
నిజమే అన్ని పార్టీ లు తీసుకున్నప్పుడు అధికార పార్టీ కి కాస్త ఎక్కువే వస్తాయి అది సహజమే. కాకపోతే సీఎం రమేష్ లాంటి వాళ్ల దగ్గర 30 కోట్ల ఫండ్ తీసుకున్న కాంగ్రెస్ వారు దానిపై యాగీ చేయడం విడ్డూరం…