ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో సీఎం జగన్మోహన్రెడ్డి అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. తన విజన్ తో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల్ని ఏర్పాటు చేసారంటూ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ సీఎం జగన్ పనితీరును కొనియాడారు.
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో యువతనుద్దేశించి ప్రసంగించిన నిక్ వుజిసిక్ ముఖ్యమంత్రి జగన్ పనితీరును మెచ్చుకున్నారు. ఏపీలో విద్యారంగంలో సంస్కరణలతో పాటు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, పాఠశాలల్లో మౌలికవసతులను ఏర్పాటు చేసి అమ్మఒడి లాంటి పథకాలతో విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నారని ఆంగ్ల మాధ్యమాన్ని ప్రమోట్ చేస్తున్న సీఎం జగన్ దేశంలో యువతకు ఇన్స్పిరేషన్ అని ప్రశంసించారు. ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ అమ్మఒడి పథకంతో పాటు సీఎం జగన్ పనితీరును ప్రశంసించడం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా మారింది.
నిక్ వుజిసిక్ చెప్పినట్లుగా సీఎం జగన్ ఏపీలోని విద్యావ్యవస్థను సమూలంగా మార్చివేశారు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ విద్యాలయాలను ప్రైవేట్ విద్యాలయాలకు ధీటుగా తయారుచేయడంలో పాటు అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద పథకాల ద్వారా విద్యార్థులకు అండగా నిలిచారు. ప్రపంచ స్థాయిలో విద్యార్థులు రాణించాలని 8వతరగతి నుండి ట్యాబులు ఇవ్వడంతో పాటు బైజూస్ కంటెంట్ ను ఫ్రీ గా అందిస్తుంది జగనన్న ప్రభుత్వం. ద్విభాషా టెక్స్ట్ బుక్స్ ను అందిస్తూ ఐబి సిలబస్ ను పాఠశాల విద్యలో ప్రవేశపెట్టి విద్యారంగంలో సమూల మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.