400 రోజులు నిర్విరామంగా పాదయాత్ర చేస్తానని పూర్తయ్యేదాకా ఇంటి మొహం చూడనని భీకర ప్రతిజ్ఞలు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈ నెల 18 తో తన పాదయాత్ర ముగించి 20 వ తారీఖు బహిరంగ సభ నిర్వహించనున్నాడని తెలుగుదేశం వర్గాలు తెలిపాయి.
2023జనవరి27న మొదలుపెట్టిన పాదయాత్ర 338రోజుల తర్వాత 2023డిసెంబర్18 నాటికి ముగియనుంది. ఈ 338 రోజులలో 120 రోజులు లోకేష్ సెలవలు పెట్టగా అవి పోను 218 రోజులు సాగిన యువగళం యాత్రలో మరో 13 రోజులు అస్సలు నడవకుండా కేవలం సభలు పెట్టి ఆ దినాలను కూడా నడిచిన రోజుల ఖాతాలో నమోదు చేసినందున నారా లోకేష్ నికరంగా 213 రోజులు నడిచినట్టు అయ్యింది.
రాజకీయ చరిత్రలో చాలా మంది నాయకులు పాదయాత్ర చేసినా ఇలా అర్ధాంతరంగా ఆపిన వారు లేరు. అంతెందుకు లోకేష్ తండ్రి చంద్రబాబు సైతం 2012 అక్టోబర్ 2 న గాంధీ జయంతి రోజు మొదలు పెట్టిన పాదయాత్రలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎండకి తట్టుకోలేనప్పుడు ఉదయం పూట కొంతసేపు, సాయంత్రం పూట కొంతసేపు పాదయాత్ర చేసేవారు. సాయం సమయంలో కూడా ఎండ తీవ్రంగా ఉన్న రోజుల్లో రోడ్డు పక్కనున్న చెట్ల నీడలో నిదానంగా ఆగుతూ సాగుతూ చివరికి 2013 ఏప్రిల్ 28 నాటికి నిర్దేశించుకొన్న లక్ష్యానికి చేరుకొన్నారు కానీ లోకేష్ లాగా ఎండకి దడిచి అర్ధ రేత్రిళ్ళు నడవలేదు.
ఇలా చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా విఫల యాత్ర చేసిన నాయకుడిగా ప్రాంతీయ పార్టీ టీడీపీ యొక్క జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ మిగిలిపోనున్నారు .
ఇహ ఈ పాదయాత్ర విశేషాలు చూస్తే యువగళం పేరు టీడీపీ పెట్టిన పేరు కాదు. జనసేనకు చెందిన నాగ సందీప్, మరో యువకుడు కలిసి యువగళం పేరిట పెట్టిన ట్రస్ట్ యొక్క వెబ్ సైట్ ని, యువగళం పేరుని అరువు తీసుకొన్న లోకేష్ ఆ సైట్ ని తన పాదయాత్ర షెడ్యూల్ తో నింపుకొన్నాడు.
మరో విశేషం ఏంటంటే యువగళం ప్రకటించిన రోజే చంద్రబాబు సభలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, రూట్ మ్యాప్ సిద్ధం చేసిన రోజు గుంటూరులో చంద్రబాబు సభలో ముగ్గురు అకాల మృత్యువాత పడ్డారు. ఇహ యువగలం ప్రారంభించిన రోజు లోకేష్ తొలి అడుగు వేయగానే కుప్పకూలిన నందమూరి తారకరత్న తర్వాత హాస్పిటల్ నుండి తిరిగిరాని లోకాలకు తరలిపోయాడు.
ఇహ పాదయాత్ర మధ్యలో ఒక కానిస్టేబుల్ వత్తిడి వలన గుండె పోటుతో, గురజాల నియోజకవర్గంలో తోపులాటలో సాంబార్ బకెట్ లో పడి ఒకరు, సత్తెనపల్లి నియోజకవర్గంలో సభకు వచ్చి యాక్సిడెంట్ లో ఒకరు ఇలా మొత్తం 15 మంది అసువులు బాసారు
అలాగే పాదయాత్ర 200 రోజులు పూర్తయ్యిన కొద్ది రోజులకు టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కుంభకోణంలో అవినీతికి పాల్పడ్డట్టు ఆధారాలు దొరకడంతో అరెస్ట్ అయ్యి 52 రోజుల జైలు జీవితం గడిపి అనారోగ్య కారణాలు చూపి బెయిల్ పొందారు. ఇదే సాకుగా ఈ సంధి కాలంలో షుమారు 80 రోజులు పాదయాత్ర ఆపిన లోకేష్ బాబు జైల్లో ఉన్న సమయంలో ఢిల్లీలో మకాం వేయటంతో తాను కూడా అరెస్ట్ అవుతాననే భయంతో ఢిల్లీలో దాక్కున్నాడని విమర్శల పాలయ్యాడు.
ఇలా దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు లాగా సాగిన లోకేష్ పాదయాత్ర అర్ధాంతరంగా ముగిస్తుండడంతో సోషల్ మీడియా వేదికగా అర్ధ వీరుడంటూ నవ్వుల పాలవుతున్నాడు నారా లోకేష్.