వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అలియాస్ వీపీఆర్. పైకి పెద్ద మనిషిలా కనిపించే ఈయన నీతిమంతుడు కాదని స్పష్టమైపోయింది. ఈ బడా పారిశ్రామికవేత్త అవసరాల కోసం ఊసరవెల్లిలా రంగులు మారుస్తాడని తాజాగా లోకేశ్ మాటలతో బయటపడింది. వీపీఆర్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజ్యసభ సభ్యుడిని చేశారు. వైఎస్సార్సీపీలో ఎంతో గౌరవం కల్పించారు. నెల్లూరు జిల్లాలో పార్టీ అధ్యక్షుడిని చేశారు. ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. కానీ టీడీపీలో చేరారు. నెల్లూరు ఎంపీ సీటు కొట్టేశారు. తన భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు అసెంబ్లీ స్థానం ఇప్పించుకున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఎందుకు బయటికి వచ్చారో ఆయన ఏనాడూ చెప్పకపోయినా ఎల్లో మీడియాలో మాత్రం తనకు అనుకూలంగా రాయించుకున్నారు.
జగన్ పార్టీలో గౌరవం దక్కలేదని, అందుకే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని ఎల్లో మీడియా ఊదరగొట్టింది. కానీ అదంతా అబద్ధమే. నెల్లూరులో బుధవారం యువతతో ముఖాముఖి నిర్వహించిన లోకేశ్ అసలు విషయం బయటపెట్టేశారు. ‘నేను జిల్లాలో గత సంవత్సరం పాదయాత్ర చేస్తున్న సమయంలో వేమిరెడ్డి గురించి తెలుసుకున్నా. ఆయనతో మాట్లాడాను’ అన్నారు. తనకు చాలా క్రెడిబిలిటీ ఉందని ప్రచారం చేసుకునే వీపీఆర్ దీనికి ఏం సమాధానం చెబుతారో. వైఎస్సార్సీపీలో పదవులు అనుభవిస్తూ.. స్వార్థంతో టీడీపీలోకి టచ్లోకి వెళ్లిన వ్యక్తి ఈయన. డబ్బు ఉంటే పెద్ద మనిషి అయిపోరు. నిజాయతీ ఎంతో ముఖ్యం. అది వీపీఆర్లో అణువంత కూడా లేదని లోకేశ్ మాటలతో తేలిపోయింది. వైఎస్సార్సీపీ విధానాలు నచ్చకపోతే ముందే చెప్పేసి వెళ్లిపోయి ఉంటే క్రెడిబిలిటీ ఉండేది. అలా కాకుండా సంవత్సరం ముందే వారితో మాట్లాడుకుని ఎన్నికల సమయంలో వెళ్లాడంటే ఆయన ఎంతటి వెన్నుపోటుదారుడో అర్థం చేసుకోవచ్చు.
వైఎస్సార్సీపీలో వీపీఆర్ ఉన్నప్పుడు బ్రోకర్ అంటూ తిట్టిపోసిన టీడీపీ పెద్దలు సంవత్సరం ముందే ఆయనతో టచ్లోకి వెళ్లి పార్టీలో చేరాలని అడిగారంటే వారెంత నీతి లేని మనుషులో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. లోకేశ్ మాటల్లో నిజం లేకపోతే వేమిరెడ్డి అక్కడే ఖండించేవాడు. కానీ అలా చేయలేదు. ఇప్పటికైనా సమయం మించి పోలేదు. చినబాబు చెప్పింది తప్పు. నిజాయతీకి ప్యాంట్, షర్ట్ వేస్తే అది నేనని వీపీఆర్ చెబుతారా.. పార్టీ మారే ఉద్ధేశం ఉన్నప్పుడు హుందాగా వెళ్లిపోవాలి. పదవులు తీసుకుని.. అభాండాలు వేయడమంటే.. ఆ సామెత అందరికీ తెలుసు కదా..