లోకేష్ తన యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన మొదలు రెడ్ బుక్ అంటూ ప్రత్యక్షం అయ్యాడు. అధికారంలో ఉన్న వైయస్సార్సీపి పార్టీలో ఉన్న శ్రేణులుపై రెడ్ బుక్ లో మీ పేరు నమోదు చేసుకుంటా మేము అధికారంలో వచ్చాక మీ అంతు చూస్తాం అంటూ బహిరంగంగానే చెప్పుకుంటూ వచ్చాడు. అది అక్కడితో సరిపెట్టలేదు నిజాయితీగా పని చేసే ప్రభుత్వ అధికారులును సైతం రెడ్ బుక్ లో మీ పేరు నమోదు చేసి 2024లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మీ అంతూ చూస్తాం అంటూ భయపెట్టడం మొదలుపెట్టాడు.
గత సెప్టెంబర్లో స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారులును సైతం తన రెడ్ బుక్ పేరుతో బెదరింప ధోరణికి దిగాడు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాములో ఉన్న లోకేష్ ను విచారణ నిమిత్తం నోటీసు ఇవ్వడానికి వెళ్లగా ఆ సమయంలో కూడా ఇలానే ప్రవర్తించాడు . లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 41ఏ సీఆర్పీసీకి ఇది విరుద్దమని విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు నెలల క్రితం సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం లోకేష్ కు గతంలోనే నోటీసులు జారీ చేసింది. దీనిలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా ఆయన తరుఫు లాయర్లు గడువు కోరడంతో మార్చి 11వ తేదీకి ఏసీబీ కోర్టు విచారణ వాయిదా వేసింది , ఇప్పటికే పలు మార్లు లోకేష్ తరుపున న్యాయవాదుల విన్నపం మేరకు విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.